కరుణానిధి తమిళనాడులోని నాగపట్టినం జిల్లాలో ఒక చిన్న గ్రామం తిరుక్కువలైలో జన్మించారు. 14 ఏళ్ల చిరు ప్రాయంలోనే ఆయన వివిధ సామాజిక ఉద్యమాలలో పాల్లొంటూ క్రమంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
కరుణానిధి తమిళనాడులోని నాగపట్టినం జిల్లాలో ఒక చిన్న గ్రామం తిరుక్కువలైలో జన్మించారు. 14 ఏళ్ల చిరు ప్రాయంలోనే ఆయన వివిధ సామాజిక ఉద్యమాలలో పాల్లొంటూ క్రమంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళనాట హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన ఎన్నో ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. మురసోలీ పేరిట ఆయన ప్రారంభించిన వార్తపత్రిక క్రమంగా పార్టీ అధికారిక పత్రికగా మారింది. రాజకీయ నాయకుడిగానే గాక తమిళ చిత్రపరిశ్రమలో కూడా ఆయన పని చేయడంతోపాటు సినిమాలలో రచనలు చేయడం ద్వారా ద్రవిడ భావజాలానికి ప్రాచుర్యం కల్పించారు.
ఆయన మొదటి చిత్రం రాజకుమారి(1947) మరియు రచయితగా ఆయన చివరి చిత్రం పొన్నార్ శంకర్(2011). పద్యం మరియు వచన రూపంలో ఆయన 100 కి పైగా పుస్తకాలను రచించారు. అందులో తిరుక్కురళ్ ఉరై, సంగ తమిళ్, కురాల్వైయం, తేన్పండి సింగం మరియు రోమపురి పాండియన్ మొదలైనవి. ఇవేగాక నటుడిగానూ ఆయన తూకు మీడై, మనిమగూడం మరియు నానే అరివలి అనే చిత్రాల్లో నటించారు. కన్యాకుమారిలోని శిలలపై 133 అడుగుల తిరువళ్లువార్ విగ్రహాన్ని కరుణానిధి హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆగస్టు 7, 2018 న 94 ఏళ్ల వయసులో కరుణానిధి కన్నుమూశారు.
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.