మేనకా గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిలిబిత్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు.
మేనకా గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిలిబిత్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. "గాంధీ కుటుంబంలో తిరుగుబాటు మహిళ"గా ఆమెకు పేరుంది. దేశ రాజకీయాల్లో ఒక శక్తిమంతమైన మహిళగా గుర్తింపు సాధించారు. తన భర్త సంజయ్గాంధీ మరణానంతరం, ప్రత్యర్థి పార్టీలతో కలిసి రాజీవ్గాంధీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై ఆమె అత్త, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమెను ఇంటి నుంచి బహిష్కరించారు. దీంతో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, ఆమె తనదైన మార్గాన్ని వెతుకున్నారు.
మేనకా, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ తరతరాలుగా కలిసి ఉంటున్న గాంధీ కుటుంబం నుంచి బయటికి వెళ్లి మళ్లీ ఇప్పటి వరకూ తిరిగి కలవలేదు. 1984 సాధారణ ఎన్నికల్లో అమేథీ నుంచి రాజీవ్గాంధీపై ఆమె పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆమె 3,14,878 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1989 ఎన్నికల్లో ఆమె జనతాదళ్ పార్టీలో చేరి, ఫిలిబిత్ ఎంపీగా గెలిచి, దేశంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఫిలిబిత్ లో తొలిసారి బరిలోకి దిగిన నాటి నుంచి ఆమె మొత్తం మీద ఆరు సార్లు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 1998, 1999 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004 సాధారణ ఎన్నికల్లో తన కుమారుడితో కలిసి బీజేపీలో చేరారు. అప్పటినుంచి ఫిలిబిత్ నియోజకవర్గం పై వాళ్లు మంచి పట్టు సాధించారు.
Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.