హోం
 » 
మేన‌కా సంజ‌య్ గాంధీ

మేన‌కా సంజ‌య్ గాంధీ

మేన‌కా సంజ‌య్ గాంధీ

మేన‌కా గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిలిబిత్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు.

మేన‌కా సంజ‌య్ గాంధీ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

మేన‌కా గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని ఫిలిబిత్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. "గాంధీ కుటుంబంలో తిరుగుబాటు మ‌హిళ‌"గా ఆమెకు పేరుంది. దేశ రాజ‌కీయాల్లో ఒక శ‌క్తిమంత‌మైన మ‌హిళ‌గా గుర్తింపు సాధించారు. త‌న భ‌ర్త సంజయ్‌గాంధీ మ‌ర‌ణానంత‌రం, ప్ర‌త్య‌ర్థి పార్టీల‌తో క‌లిసి రాజీవ్‌గాంధీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఆమె అత్త, అప్పటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ ఆమెను ఇంటి నుంచి బ‌హిష్క‌రించారు. దీంతో ఎన్ని అడ్డంకులు ఎదురైన‌ప్ప‌టికీ, ఆమె త‌న‌దైన మార్గాన్ని వెతుకున్నారు.

మేనకా, ఆమె కుమారుడు వ‌రుణ్ గాంధీ త‌ర‌త‌రాలుగా క‌లిసి ఉంటున్న గాంధీ కుటుంబం నుంచి బ‌య‌టికి వెళ్లి మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కూ తిరిగి క‌ల‌వ‌లేదు. 1984 సాధార‌ణ ఎన్నిక‌ల్లో అమేథీ నుంచి రాజీవ్‌గాంధీపై ఆమె పోటీకి దిగారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె 3,14,878 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1989 ఎన్నిక‌ల్లో ఆమె జ‌న‌తాద‌ళ్ పార్టీలో చేరి, ఫిలిబిత్ ఎంపీగా గెలిచి, దేశంలో కొత్త సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించారు. ఫిలిబిత్ లో తొలిసారి బరిలోకి దిగిన నాటి నుంచి ఆమె మొత్తం మీద ఆరు సార్లు లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. 1998, 1999 ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004 సాధార‌ణ ఎన్నిక‌ల్లో తన కుమారుడితో క‌లిసి బీజేపీలో చేరారు. అప్ప‌టినుంచి ఫిలిబిత్ నియోజ‌క‌వ‌ర్గం పై వాళ్లు మంచి ప‌ట్టు సాధించారు.

మరిన్ని చదవండి
By Moumi Majumdar Updated: Monday, April 29, 2019, 03:11:54 PM [IST]

మేన‌కా సంజ‌య్ గాంధీ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు మేన‌కా సంజ‌య్ గాంధీ
పుట్టిన తేదీ 26 Aug 1956 (వ‌య‌స్సు  67)
పుట్టిన ప్రాంతం న్యూఢిల్లీ
పార్టీ పేరు Bharatiya Janta Party
విద్య 12th Pass
వృత్తి ర‌చ‌యిత‌
తండ్రి పేరు దివంగ‌త లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ టీ.ఎస్‌. ఆనంద్
తల్లి పేరు దివంగ‌త అంతేశ్వ‌ర్ ఆనంద్
మతం సిక్కు
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

మేన‌కా సంజ‌య్ గాంధీ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹54.5 CRORE
ఆస్తులు :₹55.69 CRORE
బాధ్యతలు: ₹1.19 CRORE

మేన‌కా సంజ‌య్ గాంధీ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

మేన‌కా గాంధీ తన అత్త, ప్రధాని ఇందిరాగాంధీని ఎదిరించిన త‌ర్వాత‌, రాజీవ్‌గాంధీ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఆయ‌న ధ్యాస ఎప్పుడూ డ‌బ్బు చుట్టే, ఈ దేశాన్ని కేవ‌లం అమ్మ‌కాలు, కొనుగోళ్లు జ‌రిపే ఒక వ‌స్తువుల మార్కెట్‌గానే భావిస్తార‌ని విమ‌ర్శించారు.

సంజ‌య్ గాంధీ విమాన ప్ర‌మాదంలో మ‌రణించిన‌ప్పుడు, ఆమె వ‌య‌సు కేవలం 23 సంవ‌త్స‌రాలు. ఆమె కుమారుడు వరుణ్ గాంధీ వయస్సు 100 రోజులే కావ‌డం విషాద‌క‌రం.

మేన‌కా సంజ‌య్ గాంధీ రాజకీయ జీవితం

2014
  • మ‌రోసారి ఫిలిబిత్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ఆమె, 3,07,052 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంత‌రం కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆమె నియ‌మితుల‌య్యారు.
2009
  • మేన‌కా గాంధీ ఈ సారి అవోన్లా స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె స‌మాజ్‌వాదీ పార్టీ అభ్య‌ర్థి ధర్మేంద్ర కుమార్‌పై నెగ్గారు. ఆమె కుమారుడు వ‌రుణ్ గాంధీ ఫిలిబిత్ నుంచి గెలుపొందారు.
2004
  • మేన‌కా గాంధీ బీజేపీలో చేరి మ‌రోసారి ఫిలిబిత్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె 1,02,720 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
1999
  • స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఫిలిబిత్ బ‌రిలో దిగిన మేన‌కా గాంధీ, త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్‌కు చెందిన‌ అనీస్ ఖాన్‌ను 2,88,876 ఓట్ల తేడాతో ఓడించారు.
1998
  • స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఫిలిబిత్ బ‌రిలో దిగిన మేన‌కా గాంధీ, త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ అభ్య‌ర్థి అనీస్ ఖాన్‌ను 2,88,876 ఓట్ల తేడాతో ఓడించారు.
1996
  • ఫిలిబిత్ నుంచి మ‌రోసారి పోటీ చేసిన మేన‌కా గాంధీ, త‌న ప్ర‌త్య‌ర్థి ప‌ర‌శురాంపై 2,83,310 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
1991
  • పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఫిలిబిత్ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె, బీజేపీ అభ్య‌ర్థి ప‌ర‌శురాం చేతిలో 6923 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
1989
  • కేంద్ర ప‌ర్యావ‌ర‌ణం, అట‌వీశాఖ స‌హాయ‌మంత్రి (స్వ‌తంత్ర హోదా)గా నియ‌మితుల‌య్యారు.
1989
  • జ‌న‌తా పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఫిలిబిత్ నుంచి పోటీ చేసిన ఆమె, 1,31,224 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
1984
  • 1984 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అమేథీ స్థానం నుంచి రాజీవ్‌గాంధీపై పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆమె 3,14,878 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

గ‌త చ‌రిత్ర

1976
  • `సూర్య` పేరుతో వార్త‌ల మేగ‌జైన్‌ను స్థాపించి, సంపాద‌కురాలిగా వ్య‌వ‌హ‌రించారు.

మేన‌కా సంజ‌య్ గాంధీ సాధించిన విజయాలు

ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌గా, జంతువుల హ‌క్కుల కోసం పోరాడిన వ్య‌క్తిగా ఆమె ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల నుంచి అవార్డులు అందుకున్నారు. 1995 లో క‌మిటీ ఫ‌ర్ ద ప‌ర్ప‌స్ ఆఫ్ కంట్రోల్ అండ్ సూప‌ర్‌విజ‌న్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్ యానిమ‌ల్స్‌ (సీపీసీఎస్ఈఏ) ఛైర్‌ పర్సన్ గా నియ‌మితుల‌య్యారు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X