హోం
 » 
ములాయం సింగ్ యాద‌వ్

ములాయం సింగ్ యాద‌వ్

ములాయం సింగ్ యాద‌వ్

ములాయం సింగ్ యాదవ్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు.

ములాయం సింగ్ యాద‌వ్ బయోగ్రఫీ (జీవిత చరిత్ర)

ములాయం సింగ్ యాదవ్ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు. స‌మాజ్‌వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు. 1989, 1991, 2003-07 మధ్య‌ కాలంలో మూడుసార్లు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్‌, ములాయం కుమారుడు. ములాయం సింగ్ ప్ర‌స్తుతం ఆజ‌ంగఢ్ ఎంపీగా ఉన్నారు. 1996 నుంచి 98 మ‌ధ్య‌కాలంలో ఆయ‌న దేశ ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ప‌ని చేశారు.

1974 నుంచి 2007 మ‌ధ్య కాలంలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఆయ‌న ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ములాయం సింగ్ యాద‌వ్ చాలా రాజకీయ పార్టీల‌తో అనుబంధం కొన‌సాగించిన‌ప్ప‌టికీ, చివ‌రికి 1992 లో స‌మాజ్‌వాదీ పార్టీని స్థాపించి ఆ పార్టీకే అంకిత‌మ‌య్యారు. ప‌లు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాల‌తో త‌న పార్టీని ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో బ‌ల‌మైన ప‌క్షంగా నిలిపారు. ఆయ‌న ప్ర‌స్తుతం ఆరోసారి లోక్‌స‌భ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

మరిన్ని చదవండి
By Keshav Karna Updated: Monday, February 8, 2021, 01:13:42 PM [IST]

ములాయం సింగ్ యాద‌వ్ వ్యక్తిగత జీవితం

పూర్తి పేరు ములాయం సింగ్ యాద‌వ్
పుట్టిన తేదీ 21 Nov 1939
మరణం యొక్క తేదీ 10 Oct 2022 (వ‌య‌స్సు  82)
పుట్టిన ప్రాంతం గ్రామం. సైఫై, జిల్లా. ఎటావా, ఉత్త‌ర్ ప్ర‌దేశ్
పార్టీ పేరు Samajwadi Party
విద్య Post Graduate
వృత్తి వ్య‌వ‌సాయ‌దారుడు, రాజ‌కీయ నాయ‌కుడు, సామాజిక కార్య‌క‌ర్త
తండ్రి పేరు సుగ్‌హ‌ర్ సింగ్ యాద‌వ్
తల్లి పేరు మూర్తీ దేవి
సామాజిక నిర్వహణ సామాజిక నిర్వహణ:

ములాయం సింగ్ యాద‌వ్ నికర ఆస్తులు

నికర ఆస్తులు: ₹15.97 CRORE
ఆస్తులు :₹15.97 CRORE
బాధ్యతలు: N/A

ములాయం సింగ్ యాద‌వ్ సంబంధించి ఆసక్తికరమైన విషయాలు

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సోష‌లిస్టు నాయకుడు రామ్ మ‌నోహ‌ర్ లోహియా, ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడు రాజ్ నారాయణ్ ములాయం సింగ్ యాద‌వ్‌కు ఆద‌ర్శం.

ములాయం సింగ్ యాద‌వ్ రాజకీయ జీవితం

2019
  • లోక్‌సభ ఎన్నికల్లో ములాయంసింగ్ యాదవ్ మెయిన్‌పురి స్థానం నుంచి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అదే తనకు చివరి ఎన్నికలుగా ప్రకటించారు.
2017
  • జనవరి 1న ములాయం సింగ్ యాదవ్ సమాజ్ ‌వాది పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొనేలా అఖిలేష్ యాదవ్ ఒత్తిడి తీసుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడి మార్పు అంశం కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్దకు చేరింది. చివరికి అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు.
2016
  • డిసెంబర్ 30న తన కుమారుడు అఖిలేష్ యాదవ్, కజిన్ రామ్ గోపాల్‌లను సమాజ్‌వాది పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించారు. అదే రోజు మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
2015
  • జ‌న‌వ‌రి 29, 2015 నాడు సాధార‌ణ ప్ర‌యోజ‌నాల క‌మిటీలో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
2014
  • హోం వ్య‌వ‌హ‌రాల మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ కమిటీ, కార్మిక శాఖ స్టాండింగ్ క‌మిటీల్లో స‌భ్యుడిగా నియ‌మితుల‌య్యారు.
2014
  • ఆజ‌ంగఢ్ నియోజ‌క‌వ‌ర్గం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న బీజేపీ అభ్య‌ర్థి ర‌మాకాంత్ యాదవ్ పై 63,204 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
2009
  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్నౌర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ములాయం సింగ్ యాద‌వ్‌ పోటీ చేసి గెలిచారు.
2009
  • మెయిన్‌పురి నుంచి నెగ్గి 15 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
2004
  • మెయిన్‌పురి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఎస్‌పీ అభ్య‌ర్థి అశోక్ శాకేయాపై 3,37,870 ఓట్ల తేడాతో గెలిచి, 14 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ఆయ‌న త‌న లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌గా, అనంత‌రం జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఎస్‌పీ అభ్య‌ర్థి ధ‌ర్మేంద్ర యాద‌వ్ గెలిచారు.
2003
  • ములాయం సింగ్ యాద‌వ్‌ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు మూడ‌వ‌సారి ముఖ్య‌మంత్రి అయ్యారు.
1999
  • క‌న్నౌజ్ స్థానం నుంచి 2,91,617 ఓట్ల మెజార్టీతో నెగ్గి, 13 వ లోక్‌స‌భ‌కు తిరిగి ఎన్నిక‌య్యారు.
1998
  • సంభాల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి డీ.పీ యాద‌వ్‌ను 1,66,628 ఓట్ల తేడాతో ఓడించి, 12 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
1996
  • మెయిన్‌పురి స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థి ఉప్‌దేశ్ సింగ్ చౌహ‌న్‌పై 51,958 ఓట్ల మెజార్టీతో నెగ్గి, ములాయం 11 వ లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
1996
  • స‌హ‌స్వాన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి, 61.92 శాతం ఓట్లు సాధించి ఆయ‌న అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.
1993
  • రెండోసారి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేపట్టారు.
1993
  • స‌మాజ్‌వాదీ పార్టీ అభ్య‌ర్థిగా నిధౌలీ క‌లాన్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న బీజేపీ అభ్య‌ర్థి సుధాక‌ర్ వ‌ర్మ‌పై 7063 ఓట్ల తేడాతో గెలిచారు.
1991
  • ద‌ర్శ‌న్ సింగ్ పై మ‌రోసారి గెలిచి ఆయ‌న శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.
1989
  • ములాయం సింగ్ యాద‌వ్ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.
1989
  • జ‌శ్వంత్‌న‌గ‌ర్ నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న మొత్తం 59.26 శాతం ఓట్లు సాధించి త‌న ప్ర‌త్య‌ర్థి ద‌ర్శ‌న్ సింగ్ పై గెలిచారు.
1985
  • అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌శ్వంత్‌న‌గ‌ర్ స్థానం నుంచి ఎల్‌కేడీ అభ్య‌ర్థిగా ములాయం పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న మొత్తం 57.32 శాతం ఓట్లు తెచ్చుకుని త‌న ప్ర‌త్య‌ర్థి శివ్‌రాజ్ సింగ్ యాదవ్ పై విజ‌యం సాధించారు.
1977
  • మ‌రోసారి జ‌శ్వంత్ న‌గ‌ర్ స్థానం నుంచి జేఎన్‌డీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి, మొత్తం 64.62 శాతం ఓట్లు సాధించి స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఘోరీ లాల్ శాక్య‌పై గెలిచారు.
1974
  • జ‌శ్వంత్ న‌గ‌ర్ నుంచి బీకేడీ అభ్య‌ర్థిగా ములాయం సింగ్ పోటీలో దిగారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న విశ్వంభ‌ర్ సింగ్ యాద‌వ్‌పై 14,528 ఓట్ల తేడాతో నెగ్గారు.

Disclaimer: The information provided on this page is sourced from various publicly available platforms including https://en.wikipedia.org/, https://sansad.in/ls, https://sansad.in/rs, https://pib.gov.in/, https://affidavit.eci.gov.in/ and the official websites of state assemblies respectively. While we make every effort to maintain the accuracy, comprehensiveness and timeliness of the information provided, we cannot guarantee the absolute accuracy or reliability of the content. The data presented here has been compiled without consideration of the objectives or opinions of individuals who may access it.

భారత్‌లో పేరుగాంచిన నాయకులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X