స్టార్లకు ఆ సత్తా ఉంది: మహేష్ బాబు (ఫోటోలు)
హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును రెయిన్ బో హాస్పిటల్ గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని తెలియజేయడానికి బంజారాహిల్స్లోని ఓ హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ చైర్మన్ రమేష్ కంచర్ల, డైరెక్టర్ దినేశ్ కుమార్ చీర్లతో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ చిల్డ్రన్స్ ఆర్ కలర్ పుల్. అందుకే వారంటే నాకెంతో ఇష్టం అని చెప్పారు. రెయిన్ బో హాస్పిటల్స్తో నా ప్రయాణం 8 సంవత్సరాల క్రితం పారంభమైందని అన్నారు. మా అబ్బాయి గౌతమ్ నెలలు నిండకుండానే జన్మించాడు.
అప్పుడు రెయిన్ బో హాస్పిటల్లోని డాక్టర్లు చూపిన శ్రధ్ద నన్నెంతగానో ఆకట్టుకుంది. వారి ఇన్ వాల్వ్మెంట్ ఎమెజింగ్. నా ఉద్దేశ్యంలో అత్యుత్తమ చిన్నపిల్లల హాస్పిటల్ ఇదేనని చెప్పుకొచ్చారు. తన కుమార్తె కూడా ఇదే హాస్పిటల్లో పుట్టిందని చెప్పిన మహేష్ ఇదే అనుబంధం వారితో కొనసాగుతుందని అన్నారు.
ఇతరుల జీవితాలపై ప్రభావం చూపే సత్తా సినిమా స్టార్లకు ఉందన్నారు మహేష్ బాబు. దీనికి సంబంధించి తనకు ఎదురైన ఓ సంఘటనను ఉదహరించారు. 8 ఏళ్ల అ్బబాయికి జబ్బు చేసి రెయిన్ బో హాస్పిటల్లోనే చికిత్స చేయించు కుంటుండగా డాక్టర్ దినేష్ నన్ను పిలిచి, మీ అభిమాని అయిన ఓ అబ్బాయికి కాస్త క్రిటికల్ కండిషన్.
మీరు ఓసారి అతనితో మాట్లాడితే మార్పు రావచ్చని అన్నారు. దీంతో నేను ఆ అబ్బాయిని కలిశాను. ఆ తర్వాత ఆ అబ్బాయి చాలా త్వరగా రికవర్ అయ్యాడు. ప్రజలపై సినిమా స్టార్ల ప్రభావం ఉంటుందని చెప్పడానికి నాకు గట్టిగా నమ్మకం కలిగిన సంఘటన అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దీపాంజలి నృత్య కళాశాల విద్యార్ధులు చేసిన నృత్యాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు కూడా పాల్గొన్నారు.
{photo-feature}