హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరపైకి తెలంగాణ విమోచన సమితి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరో ఉద్యమ పార్టీ ఆవిర్భవించింది. హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్‌ కాళోజీ ప్రాంగణంలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, రఘునాథ్‌ తదితరులు తెలంగాణ విమోచన సమితి(తెవిస) పార్టీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పార్టీ రూపకర్త, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ ఆవిర్భావ సభలో మాట్లాడారు.

తెవిస రాజకీయ పార్టీ కాదని తెలిపారు. ఒక్క తెరాసతోనే తెలంగాణ సాధ్యం కాదని..జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కలిసివస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రాధాన్యాన్ని ఎంతగా వివరించిన..ప్రస్తుతం తెరాస ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే స్థితిలో లేదన్నారు. కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను గాయపరిచాయన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X