వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరదలో చిక్కుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

Mantralayam
కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయం శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి వరద నీటిలో చిక్కుకున్నారు. ఆయనతో పాటు 500 మంది రాంపురంలో మిద్దెపైకి ఎక్కి ప్రాణాలు అరచేత పట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరో రెండు అడుగులు నీరు పెరిగితే తనతో పాటు అందరం వరదలో కొట్టుకుపోతామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. మంత్రాలయం పూర్తిగా నీటిలో మునిగింది. 9 అడుగుల మేర నీరు చేరింది. రాఘవేంద్ర స్వామి ఆలయంలోకి నీరు చేరింది.

కర్నూలు జిల్లా వరద బీభత్సంతో అతలాకుతలమైంది. గాజుల దిన్నె ప్రాజెక్టుకు గండి పడింది. దాని కింది గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. సుంకేశుల ప్రాజెక్టుకు కూడా గండి పడింది. సహాయక చర్యల కోసం వెళ్లిన పది మంది ఇంజినీర్లు సుంకేశుల ఆనకట్టపైన చిక్కుకుపోయారు. మంత్రాలయంలో 12 వేల మంది భక్తులు చిక్కుకుపోయారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు కూడా గండి పడింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోకి నీరు చేరుతోంది. ప్రమాద స్థాయిలో రెండు విద్యుత్కేంద్రాలు కూడా చిక్కుకున్నాయి. మంత్రాలయంలో ఉన్న ఒకే ఒక ఎత్తయిన భవనంపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X