హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కడ కూర్చునే రోజు దగ్గర్లోనే ఉంది: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: మాజీ శాసనసభ్యుల పక్కన కూర్చునే రోజు తనకు దగ్గర్లోనే ఉందని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. పాత అసెంబ్లీ హాలులో శుక్రవారం జరిగిన మాజీ శాసనసభ్యుల ఫోరం సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రోశయ్యను మాజీ శాసనసభ్యులను సన్మానించారు. మాజీ శాసనసభ్యులకు బస్సు సౌకర్యం, పరిమిత వ్యయంతో వైద్య సౌకర్యం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

దేశంలో మరెక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, వాటి నిర్వహణ భారంగా మారిందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలపై రెవెన్యూ వ్యయం పెరుగుతోందని ఆయన అన్నారు. వాటి అమలు చాలా వ్యయంతో కూడుకున్నదని ఆయన అన్నారు. రెవెన్యూ లోటు పెరిగి పోయిందని ఆయన అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే ప్రస్తుత శాసనసభ్యుల డిమాండ్ల పరిష్కారాన్ని వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X