రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తూగో ప్రజారాజ్యం మెగా కమిటీ ఏర్పాటు

By Santaram
|
Google Oneindia TeluguNews

Prajarajyam Party
కాకినాడ: రాష్ట్రంలో అతి పెద్దదైన తూర్పు గోదావరి జిల్లా ప్రజారాజ్యం పార్టీ విభాగానికి నూతన కమిటీ ఏర్పాటు చేశారు. 127 మంది సభ్యులతో ఏర్పాటైన జంబో కమిటీని, స్థానిక అనుపమ సమావేశ మందిరంలో పీఆర్పీ జిల్లా కమిటీ అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ గురువారం వెల్లడించారు. జిల్లాలోని 19 నియోజకవర్గాలకూ కమిటీలో ప్రాతినిధ్యం కల్పించామని, ఇక నుంచి పార్టీ కార్యకలాపాల విస్తృతికి పూర్తిస్థాయిలో నడుం బిగిస్తామని చెప్పారు. మహిళారాజ్యం, యువరాజ్యం, రైతురాజ్యం, దళితరాజ్యం కమిటీ అధ్యక్షుల పేర్లు కూడా ప్రకటించారు. వీటి కమిటీలను శుక్రవారం విడుదల చేస్తామని చెప్పారు. కాకినాడ అర్బన్‌ కమిటీని సుమారు వారం రోజుల్లోగా ప్రకటిస్తామని, రాజమండ్రి అర్బన్‌ కమిటీ వెల్లడికి మరికొంత సమయం పడుతుందని జ్యోతుల నెహ్రూ చెప్పారు.

జిల్లా అధ్యక్షుడు: జ్యోతుల నెహ్రూ
ఉపాధ్యక్షులు: రెడ్డి గోవిందరావు(మండపేట), బాదం బాలకృష్ణ (కాకినాడ-1), శెట్టిబత్తుల రాజబాబు (రామచంద్రపురం), వై.శ్రీనివాస్‌ (రాజమండ్రి), సత్తి గంగాదేవి (రామచంద్రపురం)
ప్రధాన కార్యదర్శులు: మానేపల్లి అయ్యాజీవేమ (రాజోలు), కుడిపూడి శివన్నారాయణ (ముమ్మిడివరం) అధికార ప్రతినిధులు : అయినవిల్లి ఉదయభాస్కర్‌ (అమలాపురం), దొండపాటి సత్యంబాబు (రాజమండ్రి-1), అలమండ చలమయ్య (ప్రత్తిపాడు), సుంకర తిరుమలకుమార్‌ (కాకినాడ-1)
ప్రచార కార్యదర్శులు: మేడా గురుదత్‌ప్రసాద్‌ (రాజమండ్రి-1), దళే సూరిబాబు (ప్రత్తిపాడు), తిరుమాని స్వామినాయకర్‌ (కాకినాడ-1), పెమ్మిరెడ్డి మురళీకృష్ణ (రామచంద్రపురం), అయితాబత్తుల సుభాషిణి (అమలాపురం), బొండా సూర్యారావు (కాకినాడ-2)

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X