తర్నాకాలో ఒయు విద్యార్థుల దాడులు: లాఠీచార్జీ, అరెస్టులు
లాఠీచార్జీలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల ర్యాలీలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్సై రాత పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గత రెండు రోజులుగా తీవ్ర ఆందోళనలకు దిగారు. డిజిపి అరవింద రావుపై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ ను ఫ్రీజోన్ నుంచి మినహాయించాలని, హైదరాబాద్ ను ఆరో జోన్ లో భాగం చేయాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ జరిగే వరకు ఎస్సై పోస్టుల భర్తీని ఆపేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
Story first published: Thursday, November 18, 2010, 15:34 [IST]