హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవివల్ల లాభం లేదని తెలిసింది: జగన్ వర్గం సబ్బం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
హైదరాబాద్/గుంటూరు: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవితో ఆ పార్టీకి లాభం లేదని ఈ ఉప ఎన్నికల ద్వారా తేలిపోయిందని అనకాపల్లి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి బుధవారం వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెసు పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికల ఫలితాల ద్వారా చిరంజీవి ప్రచారం కాంగ్రెసుకు లబ్ధి చేకూర్చదని తెలిసిందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు ఉప ఎన్నికల్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం జగన్ పట్ల రాష్ట్ర ప్రజలకు ఉన్న ఆదరణను తెలియజేస్తుందన్నారు. త్వరలో వచ్చే పదిహేడు నియోజకవర్గాలలో జరిగే ఉప ఎన్నికల్లోనూ వైయస్సార్ కాంగ్రెసు ఘన విజయం సాధిస్తుందన్నారు. ఓట్ల చీలికతో లాభపడుదామనుకున్న టిడిపి ఆశలు గల్లంతయ్యాయన్నారు.

కాగా కొవూరులో నల్లపురెడ్డి గెలిచిన సందర్భంగా గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో ఉన్న జగన్ కృష్ణాపురంలో కేక్ కట్ చేశారు. కడప జిల్లా పులివెందులలో పార్టీ కార్యకర్తలు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ విజయమ్మకు పూలబోకె ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. టపాసులు పేల్చారు. మిఠాయిలు పంచారు.

English summary
Anakapalli MP Sabbam Hari said that bypolls results showing that there is no use to Congress with Tirupati MLA Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X