హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం మరో ఆత్మహత్య, సభలోనే తెరాస

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్స్‌లో సోమవారం రాజమొగిలి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతను వరంగల్ జిల్లా జాఫర్‌గఢ్ మండలం తిమ్మంపేట వాసి. అతని మృతదేహాన్ని వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. శనివారంనాడు హనుకొండలోనే బోజ్యా నాయక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాజమొగిలి ఆత్మహత్యపై ఢిల్లీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, తెలంగాణపై తెరాస, బిజెపి సభ్యులతో పాటు స్వతంత్ర సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి చర్చకు పట్టుబట్టడంతో శాససభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను రేపటికి వాయిదా వేశారు. అయినా సభ్యులు శాసనసభను విడిచి వెళ్లలేదు. తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసే వరకు సభలోనే ఉంటామని వారు చెబుతున్నారు. తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించే వరకు పోరాటం చేస్తామని తెరాస సభ్యుడు సోమారపు సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై వైఖరిని స్పష్టం చేయాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని డిమాండ్ చేశారు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టిపోసుకోవడానికే సభా కార్యక్రమాలను తెలుగుదేశం, కాంగ్రెసు వినియోగిస్తున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజలను గాయపరిచే విధంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెరాస శాసనసభ్యుడు కొప్పులు ఈశ్వర్ అన్నారు. తెలంగాణపై వైఖరి చెప్పకుండా కాంగ్రెసు, తెలుగుదేశం సభను వాయిదా వేసుకుని పోతున్నాయని ఆయన అన్నారు. ఎన్ని వందల మంది విద్యార్థులను బలిగొంటారని ఆయన అడిగారు. తెలంగాణ తీర్మనం పెట్టే వరకు సభలోనే ఉంటామని ఆయన చెప్పారు.

English summary
Another youth committed suicide for Telangana. TRS members stall assembly proceedings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X