వెళ్లనంటే వెళ్లను: తగ్గని కావూరి, జగన్ పార్టీలోకి నేనా..
తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళుతున్నట్లుగా వచ్చిన వార్తలను కావూరి కొట్టిపారేశారు. తాను జగన్ పార్టీలోకి వెళుతున్నట్లుగా ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు. కావూరిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుజ్జగిస్తున్నారు. లోకసభ సమావేశాలకు హాజరు కావాలని కిరణ్ కావూరిని కోరుతున్నట్లుగా సమాచారం. అయితే అందుకు కావూరి మాత్రం ససేమీరా అన్నారని తెలుస్తోంది.
కాగా రేపటి నుండి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అటు ఢిల్లీ, ఇటు హైదరాబాదులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కూడా తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటానని హామీ ఇస్తేనే సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విప్ జారీ చేసినా వెళ్లకూడదనే ఆలోచనలో ఎంపీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంపీలు తెలంగాణ కోసం కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అండ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.