చెన్నై ప్లేయర్తో హోటల్లో యువతి: బాంబుపేల్చిన బింద్రా
2010లో శ్రీలంక పర్యటన జరిగినప్పుడు ఎల్టిటిఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిందని, క్రికెటర్లు బస చేసిన హోటల్లోని ప్రతి ఫ్లోర్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ సమయంలో ఓ యువతి ఓ భారత క్రికెటర్ ఆటగాడి గదికి వెళ్లిందన్నారు.
ఆ ఆటగాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆరు సీజన్లలో ఆడుతున్నాడని చెప్పారు. ఆ రాత్రి ఆమె హోటల్ గదిలోనే ఉందన్నారు. ఆ యువతికి బుకీలతో సంబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై శ్రీలంక ఆర్మీ జనరల్ శ్రీలంక క్రికెట్ బోర్డుకు నివేదిక ఇచ్చారన్నారు.
శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ నివేదికను ఐసిసికి పంపించిందని అయితే, ఆ తర్వాత బిసిసిఐ ఒత్తిడి కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గిందని చెప్పారు. బోర్డులో సభ్యుడు ఈ నివేదికను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన భారత ఆటగాడు అని చెప్పిన బింద్రా ఆ ఆటగాడి పేరు మాత్రం బయటపెట్టలేదు.