మావోల దాడి: ఎస్పీ సహా 8 మంది పోలీసులు మృతి
పోలీసు కాన్వాయ్లో పాకూరు ఎస్పీ అమర్జిత్ బలిహారు కూడా ఉన్నారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో మరణించినవారిలో ఆయన కూడా ఉన్నారు. తన నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీయడానికే మావోయిస్టులు ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారని జార్ఖండ్ పోలీసు సంఘం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించింది.
ఈ సభలో పాల్గొని ఎస్పీ తిరిగి వస్తుండగా మోటార్కేడ్పై మావోయిస్టులు దాడి చేశారు. సంఘటన జరిగిన ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలు తరలివెళ్లాయి. దాడి అనంతరం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఉన్న పాకూరు జిల్లాలో నక్సల్స్ ప్రభావం లేదని ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. అయితే, దుమ్కాలో మాత్రం మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. పాకూరు, దుమ్కా సరిహద్దుల్లో ఈ దాడి జరిగింది. రాష్ట్ర పోలీసు క్యాడర్ నుంచి ఇటీవలే బలిహార్కు ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది.