వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మురళీమోహన్‌, కుటుంబానికి హైకోర్టులో ఊరట-సీఐడీ చర్యలకు బ్రేక్

|
Google Oneindia TeluguNews

అమరావతిలో జయభేరి ప్రాపర్టీస్ నిర్మాణంలో స్ధల యజమానితో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘించారంటూ దాఖలైన ఫిర్యాదుపై గ్రూప్ ఛైర్మన్ మురళీమోహన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఊరట లభించింది. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇవాళ సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది.

జయభేరి ప్రాపర్టీస్ నిర్మాణం కోసం తీసుకున్న స్ధలానికి సంబంధించి ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారని స్ధల యజమాని సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ భూ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ.. 41ఏ సెక్షన్ కింద మురళీ మోహన్ తో పాటు కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా... హైకోర్టు విచారణకు స్వీకరించింది.

big relief to jayabheri chairman muralimohan family members as high court orders to stop cid action

Recommended Video

Ram Charan క్రేజ్ కా బాప్, మీసం తిప్పిన చరణ్ ! | RRR Movie || Oneindia Telugu

మురళీ మోహన్ జయభేరి ప్రాపర్టీస్ కోసం తీసుకున్న స్ధల ఒప్పందాన్ని ఉల్లంఘించారని దాఖలైన ఫిర్యాదుపై సీఐడీ దాఖలు చేసిన కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.... తదుపరి చర్యలు తీసుకోకుండా సీఐడీని నిలువరిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
మురళీ మోహన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మురళీ మోహన్ తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. సీఐఢీ ఈ సివిల్‌ వివాదాన్ని క్రిమినల్‌ వివాదంగా మార్చిందని శ్రీనివాస్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. జయభేరీ ప్రాపర్టీస్ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని కోర్ట్ కు తెలియజేశారు. దీంతో కేసులో అన్ని రకాల చర్యలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

English summary
andhrapradesh high court on today order not to take any action against jayabheri group chairaman murali mohan and his family members in lands case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X