అటు శంకుస్థాపన: ఇటు చంద్రబాబు, వెంకయ్యల దిష్టిబొమ్మలు దహనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనంటూ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ-బీజేపీ కూటమిని గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతి సభలో చెప్పారని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్లో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరిని వెంకయ్య నాయుడైతే దానిపై ఇప్పుడు మాట్లాడటమే మానేశారని మండిపడ్డారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ర్యాలీలు, నిరసన దీక్షలతో ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకహోదాపై చంద్రబాబు, వెంకయ్య దొంగాట: సీపీఐ రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కల్పించే విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు దొంగాట ఆడుతున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం(ఈ 22న) నాడు ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు.
ప్రకటన రాని పక్షంలో ఈనెల 23న ప్రధాని దిష్టిబొమ్మలు దహనం చేస్తామన్నారు. దీంతో పాటు ప్రత్యేక హోదాపై 13 జిల్లాల్లో 13 రోజుల పాటు సాగిన పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్, మాల మహానాడు, ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ ప్రధాని నరేంద్రమోడీకి ఏఐసీసీ రాహుల్ గాంధీ లేఖ రాయడంపై వెంకయ్య చిందులేస్తున్నారని, దానికి అర్థమే లేదని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications