ప్రత్యక్ష రాజకీయాల్లోకి వేణుమాధవ్!? అందుకే చంద్రబాబును కలిశారా?
హాస్యనటుడు వేణుమాధవ్.. చంద్రబాబును కలవడం వెనుక అసలు కథ వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. వేణుమాధవ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహంతో ఉన్నారని, ఆ దిశగా ఆయన ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పుకుంటున్
హైదరాబాద్: హాస్యనటుడు వేణుమాధవ్ ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య నంద్యాల ఉపఎన్నికల టీడీపీ తరుపున వేణుమాధవ్ ప్రచారంలో కనిపించారు. మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు.
Recommended Video
గురువారం సాయంత్రం వెలగపూడి వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశం అయిన సంగతి తెలిసిందే. 'ఏంటో విశేషం అంటే'.. 'ఏం లేదు.. చంద్రబాబును కలిసి చాన్నాళ్లు అయ్యింది, ఆయన మీద బెంగ మొదలైంది. అందుకే వచ్చి కలిశా..' అని వేణుమాధవ్ మీడియా ప్రతినిధులకు బిస్కెట్ వేశారు.
అయితే ఆయన చంద్రబాబును కలవడం వెనుక అసలు కథ వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. వేణుమాధవ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉత్సాహంతో ఉన్నారని తెలుస్తోంది.
టీడీపీ అంటే బాగా ఇష్టపడే వేణుమాధవ్.. ఆ పార్టీ ద్వారానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ తరఫున పెద్దగా హడావుడి చేసే వాళ్లు లేకుండా పోయారు.
దీంతో ఆయన టీటీడీపీలో చేరబోతున్నారని, ఆ తరువాత తెలంగాణ నుంచే వేణుమాధవ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది పార్టీని వీడటంతో తెలంగాణ టీడీపీలో కొంత ఖాళీ కూడా ఏర్పడింది.
ఈ నేపథ్యంలో వేణుమాధవ్ కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడని.. టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.
హైదరాబాద్ పరిధిలో లేదా.. తన సొంత జిల్లా అయిన నల్లగొండలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నాడని సమాచారం. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇది వరకూ బాబూమోహన్ వంటి కొంతమంది కమేడియన్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారు.. మరి హాస్యనటుడు వేణుమాధవ్ కథ ఎంత వరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే!