వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'వైఎస్ కు ఎక్కడ పేరొస్తుందోననే..! చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదు'

|
Google Oneindia TeluguNews

అనంతపురం : అధికారంలో ఉన్న నేతలు అభివృద్దిని కాంక్షించడం పరిపాటి. అలా కాకుండా రాజకీయ వివక్షను అభివృద్దికి ఆపాదించి స్వార్థపూరితంగా వ్యవహరిస్తే..! ఏపీ సీఎం చంద్రబాబు తీరు ఇలాగే ఉందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు.

తాజాగా కృష్ణా పుష్కరాల సందర్బంగా.. అనంతరపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ లో పుష్కర స్నానం చేసిన వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందో అన్న ఉద్దేశంతో చంద్రబాబు హంద్రీనీవా ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆరోపించారు. పుష్కర స్నానం అనంతరం పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి.. చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలని భగవంతుడిని కోరినట్లు తెలిపారు.

Visweswara Reddy takes on chandrababu naidu over handri neeva issue

ఇంకా ఆయన మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు కృష్ణా నీటిని తీసుకొచ్చిన ఘనత వైఎస్ కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. ప్రతీ ఏటా 15 టీఎంసీల కృష్ణా జలాలు వస్తున్నా..! ఒక్క ఎకరాకు కూడా నీరందించిన పరిస్థితి లేదని చంద్రబాబుపై మండిపడ్డారు. డిస్ట్రిబ్యూటరీలను వెంటనే పూర్తి చేసి పంటలకు సాగునీరు అందించాలని చంద్రబాబు సర్కార్ ను విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.

English summary
YSRCP MLA Visweswara Reddy made some allegations on CM Chandrababu naidu. He said chandrababu wantedly neglected handri neeva project
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X