భారత్ లో కాస్త తగ్గిన కరోనా కొత్త కేసులు; కానీ పెరుగుతున్న యాక్టివ్ కేసులు.. తాజా పరిస్థితి ఇదే !!

భారతదేశంలో కరోనా వ్యాప్తికి కొనసాగుతోంది. గత 24 గంటల్లో కేసులు కాస్త తగ్గి 29,616 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్న 31,382 కేసుల గణాంకాల కంటే 5.6 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 290 మరణాలు నమోదయ్యాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 100 కి గుర్తించబడిన పాజిటివ్ కేసుల సంఖ్య 1.86% గా ఉంది.

కరోనా మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, చెల్లించే బాధ్యత రాష్ట్రాలదే : సుప్రీంకు కేంద్రం, గైడ్ లైన్స్ ఇవే !

గత 24 గంటల్లో కరోనా నుండి కోలుకున్న 28 వేల మంది

గత 24 గంటల్లో కరోనా నుండి కోలుకున్న 28 వేల మంది

గత 24 గంటల్లో 15,92,421 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న కరోనా మహమ్మారి బారినుండి 28 వేల మంది కోలుకున్నారు. నిన్న రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసులు 3.36 కోట్లకు చేరగా రికవరీలు 3.28 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం మూడు లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా మహమ్మారి కారణంగా బలైన వారు 4.46 లక్షల మంది, నిన్న 71 లక్షల మందికి కరోనాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్లు వేశారు. దీంతో మొత్తంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డోసులు సంఖ్య 84.89 కోట్లు.

కేరళలో 17,983 కేసులు మరియు 127 కోవిడ్ మరణాలు

కేరళలో 17,983 కేసులు మరియు 127 కోవిడ్ మరణాలు

కేరళలో అత్యధికంగా రోజువారీ కేసులు నమోదవుతున్న రాష్ట్రం, తాజాగా కేరళ రాష్ట్రంలో 17,983 కేసులు మరియు 127 కోవిడ్ మరణాలు సంభవించాయి. పొరుగున ఉన్న కర్ణాటకలో 789 కొత్త కేసులు మరియు 23 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్రం 1 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లోని థియేటర్లు మరియు పబ్‌లలో 100 శాతం ఆక్యుపెన్సీని అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రంలో దసరా ఉత్సవాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. సరిహద్దు ప్రాంతాల్లో కఠినమైన నిఘా ఉంచబడుతుందని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 3,286 కేసులు మరియు 52 మరణాలు

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 3,286 కేసులు మరియు 52 మరణాలు

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 3,286 కేసులు మరియు 52 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. నవరాత్రి మొదటి రోజు అక్టోబర్ 7 నుండి రాష్ట్రంలో అన్ని ప్రార్థనా స్థలాలు, ఆలయాలు తిరిగి తెరవబడతాయని ముఖ్యమంత్రి కార్యాలయం నిన్న సాయంత్రం ట్వీట్ చేసింది. అన్ని కోవిడ్-19 భద్రతా నియమాలు అనుసరించబడతాయని వెల్లడించింది. జాతీయ రాజధాని ఢిల్లీలో 24 కొత్త కేసులు మరియు సున్నా కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సానుకూలత రేటు 0.03 శాతానికి పడిపోయింది. గత కొన్ని వారాలుగా నగరంలో తక్కువ సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, కోవిడ్ -19 కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉనికిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న సెరోలాజికల్ ప్రివెలెన్స్ సర్వేలో ఏడవ రౌండ్ శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది.

Recommended Video

    Evergrande Crisis Turn Into China's Lehman Brothers? Explained || Oneindia Telugu
    దేశంలో మూడో వేవ్ వచ్చినా, తీవ్రత తక్కువగానే సీఎస్ఐఆర్

    దేశంలో మూడో వేవ్ వచ్చినా, తీవ్రత తక్కువగానే సీఎస్ఐఆర్

    రాజస్థాన్, గుజరాత్, బీహార్ - మూడు పెద్ద రాష్ట్రాలు - సున్నా కోవిడ్ మరణాలు నివేదించబడ్డాయి. ఉత్తర ప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్‌లో ఒక్కో కోవిడ్ మరణం నమోదైంది. 1,322 కోవిడ్ కేసులతో ఉన్న మిజోరామ్ ఈశాన్య రాష్ట్రాలలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులలో ముందంజలో ఉంది. మిజోరాం రాష్ట్రంలో ఐదు కోవిడ్ మరణాలు కూడా నమోదయ్యాయి. గత 24 గంటల్లో అస్సాంలో 406 కేసులు మరియు ఏడు కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దేశంలో మూడో వేవ్ వచ్చినా, దాని తీవ్రత తక్కువగా ఉంటుందని ప్రముఖ వైద్య సంస్థ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) శుక్రవారం తెలియజేసింది. వికలాంగుల వర్గానికి చెందిన వ్యక్తులు మరియు పరిమిత కదలికలు ఉండి అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి ప్రభుత్వం ఇంటింటికీ వెళ్లి మరీ కరోనా టీకాలను వేయాలని నిర్ణయించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+