నెట్లో ప్రచారానికి ఐఐఎం గ్రాడ్యుయేట్, జయకి గండం!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన పార్టీ ఐటీ విభాగం కొత్త కార్యదర్శిగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ మేనేజ్మెంట్ (ఐఐఎం) గ్రాడ్యుయేట్ జి రామచంద్రన్ను నియమించారు. త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆన్లైన్లోను జోరుగా ప్రచారం చేసే ఉద్దేశ్యంలో భాగంగా కొత్త కార్యదర్శిని నియమించారు. రామచంద్రన్ కోయంబత్తూరు నియోజకవర్గంలోని శింగనల్లూరుకు చెందిన వారు. అతనికి పార్టీ క్యాడర్ సహకరించాలని అమ్మ ఆదేశించారు.
ఇదిలా ఉంగా, జయలలితకు కోర్టు కేసుల కష్టాలు అప్పుడే తీరేలా కనిపించడం లేదు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులో కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది.
ఈ కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించగా ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. పైగా ఈ కేసు విచారణ తుది తీర్పు మే నెల 19వ తేదీన వెల్లడి కానున్న అసెంబ్లీ ఎన్నికల ఫళితాల కంటే ముందుగానే వెల్లడయ్యే అవకాశముందని తెలుస్తోంది.త దీంతో ఆమెకు ఓ వైపు ఎన్నికల గండం, మరోవైపు కోర్టు గండం పొంచి ఉంది.