ఐఆర్సీటీసీలో 3 కోట్ల ఫేక్ ఖాతాల తొలగింపు.. కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ irctc పోర్టల్ పైన కీలక అప్డేట్ ఇచ్చారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. రైల్వే టికెట్ల బుకింగ్ వ్యవస్థకు అంతరాయాన్ని కలిగించి, ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా దుర్వినియోగానికి పాల్పడుతున్న నకిలీ ఐడీలను గుర్తించిన కేంద్రం చర్యలు తీసుకున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
irctcలో నకిలీ ఐడీలను తొలగించిన కేంద్రం
irctc ప్లాట్ ఫామ్ లో 3.03 కోట్ల నకిలీ ఐడీలను తొలగించినట్టు ఆయన వెల్లడించారు. ఈ చర్యల కారణంగా సాధారణ ప్రయాణికులకు టికెట్లు సులభంగా అందే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ దందాను అరికట్టడానికి ఈ చర్య కీలకంగా మారిందని పేర్కొన్నారు.

ఫేక్ అకౌంట్స్ పైన చర్యలు తీసుకున్నామన్న రైల్వే మంత్రి
రైల్వే దళారులు పెద్ద సంఖ్యలో నకిలీ ఖాతాలను ఉపయోగించి టికెట్లను బుక్ చేసి, వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం, ఈ క్రమంలో సామాన్య ప్రజలకు మేలు చేయడానికి ఆయా ఫేక్ అకౌంట్లో పైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఫేక్ అకౌంట్ల తొలగింపుతో బుకింగ్ వ్యవస్థ పారదర్శకంగా మారిందని, నిజమైన ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన వెల్లడించారు.
దేశవ్యాప్తంగా రైళ్లలో 78 శాతం సీట్లు నాన్-ఏసీ కేటగిరీలోనే
రైల్వే సేవల విస్తరణపై కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైళ్లలో 78 శాతం సీట్లు నాన్-ఏసీ కేటగిరీలోనే ఉన్నాయని చెప్పారు. సాధారణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణించేందుకు ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 75,000 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు వెల్లడించారు.
irctc అతిపెద్ద ప్రక్షాళన
పండుగల సమయంలో, రద్దీ రోజుల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతమైన, సరసమైన రవాణా సేవలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తత్కాల్ మరియు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ టికెట్ల అమ్మకాలను దీర్ఘకాలంగా పీడిస్తున్న నకిలీ ఖాతాలు, ఆటోమేటెడ్ బాట్ లు మరియు మోసపూరిత బుకింగ్ పద్ధతులపై విస్తృత చర్యలలో భాగంగా irctc అతిపెద్ద ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు.
ప్రధానంగా ఈ అంశాలపైనే దృష్టి
టికెట్ బుకింగ్లో పారదర్శకత పెంచడం, దళారుల అక్రమాలను అరికట్టడం, మరియు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడం వంటి అంశాలపై రైల్వే మంత్రి దృష్టి సారించినట్లు ఆయన తన వ్యాఖ్యలతో తెలిపారు.
-
IRCTC వేసవిలో అరకు, విశాఖ టూర్ స్పెషల్ ఆఫర్ - 3 రోజులు, ప్యాకేజీ ఇలా..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం













Click it and Unblock the Notifications