రైళ్లలో నో మసాజ్ .. ప్రతిపాదనపై వెనక్కితగ్గిన రైల్వేశాఖ .. కారణమిదే ..?
న్యూఢిల్లీ : రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థ మసాజ్ ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంటా బయట విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. రైళ్లలో ప్రయాణికుల మసాజ్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను వెనక్కితీసుకుంటున్నట్టు శనివారం రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆదాయం కోసం ..
ప్రయాణికుల కోసం కొన్ని రైళ్లలో ప్రయోగాత్మకంగా మసాజ్ ప్రవేశపెడతామని ఈ నెల 8న రైల్వేశాఖ తెలిపింది. కొన్నిరోజుల్లో ఇండోర్ నుంచి బయల్దేరే 39 రైళ్లలో ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ సిబ్బంది ప్రయాణికులకు తల, మెడ, కాళ్లకు మసాజ్ చేస్తారని పేర్కొన్నది. దీంతో ఈశ్చిమ రైల్వేకు అదనంగా రూ.20 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. అంతేకాదు టికెట్ల అదనంగా బుక్ చేసుకునేవారితో రైల్వేకు రూ.90 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. దాదాపు 20 వేల అదనంగా టికెట్లు కొను202గోలు చేస్తారని లెక్కట్టింది.
విమర్శలతో ..
కానీ రైళ్లలో మసాజ్ ప్రవేశపెట్టడాన్ని సొంత పార్టీ నుంచి విమర్శలు వచ్ాచయి. ఇండోర్ ఎంపీ శంకర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖకు లేఖ కూడా రాశారు. ఇది భారతీయ సంస్కృతికి విరుధ్దమని .. అలాంటి మసాజ్ మహిళల ముందు చేయడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. రైళ్లలో ఆదాయం సమాకూర్చుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఓకే కానీ ... మసాజ్ మాత్రం సరికాదని సూచించారు. అంతేకాదు శతాబ్ధి, రాజధాని తప్పితే మిగతా రైళ్లలో 4 గంటల ప్రయాణం కోసం ఏ ప్రయాణికుడు మసాజ్ కావాలని కోరుకుంటారని ప్రశ్నించారు. దీనిపై మహిళల నుంచి నిరసన వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైల్వేశాఖ 3 క్యాటగిరీలుగా మసాజ్ను విభజించింది. గోల్డ్, డైమండ్, ప్లాటినం అని పేర్కొంది. గోల్డ్ విభాగంలో ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేస్తారు. ఇందుకు రూ.100 చార్జీ చేస్తారు. డైమండ్ సర్వీస్లో రూ.200 చార్జీ చేస్తారు. ప్లాటినం ప్యాకేజీలో రూ.300 వసూల్ చేస్తారు. ఈ మూడు విభాగాల్లో ప్రయాణికులకు ఇరవై నిమిషాల పాటు మసాజ్ చేస్తామని అంతకుముందు ప్రకటించారు. అయితే అన్నిపక్షాల నుంచి నిరసనలు రావడంతో .. ఈ ప్రతిపాదనపై రైల్వేశాఖ వెనక్కి తగ్గింది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications