మగాళ్లు సెక్సువల్ వేధింపులకు గురైతే..! : చెక్ పెట్టనున్న యూజీసీ
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులనేవి ఆడవాళ్లనే కాదు, మగాళ్లనూ వేధించే సమస్యే. విద్యాసంస్థల్లో, పని ప్రదేశాల్లో మగాళ్లపై లైంగిక దాడులు జరిగినా..! పరువు సమస్యతో బయటకిరాని ఉదంతాలు చాలానే ఉండుంటాయి. అదీగాక లైంగిక వేధింపులకు సంబంధించి పురుషులకంటూ ప్రత్యేక చట్టాలేవి లేకపోవడం కూడా ఈ సమస్యను బయటపెట్టడంలో పురుషులు వెనకడుగు వేసేలా చేస్తున్నాయి.
దీనికి పరిష్కారంగా.. పురుషుల కోసం ఇప్పుడు సరికొత్త మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకురానుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ). ఈ మేరకు ఉన్నత విద్యాసంస్థల్లో పురుషులెవరైనా లైంగిక వేధింపులకు గురైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించి యూజీసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

యూజీసీ మార్గదర్శకాల ప్రకారం.. లైంగిక వేధింపులకు గురైన పురుషులెవరైనా సరే ఘటన జరిగిన మూడు నెలల్లోగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. లేనిపక్షంలో బాధితుడి తరుపున బంధువులు, స్నేహితులు కూడా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
అయితే.. ఘటన తర్వాత ఒకవేళ బాధితుడు అనారోగ్యం బారిన గనుక పడితే మూడు నెలల తర్వాత కూడా ఫిర్యాదును స్వీకరించేలా మార్గదర్శకాలు జారీ చేసింది యూజీసీ. కాగా, ఈ ఫిర్యాదులపై కొన్ని ప్రత్యేక కమిటీలు మూడు నెలల్లోగా విచారణ జరిపి నివేదికను సమర్పిస్తాయి.
కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా బాధితుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డవారిని వర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఒకవేళ అధ్యాపకులే అలాంటి చర్యలకు పాల్పడితే సర్వీసు నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తప్పనిసరి కానున్నాయి.
ఆడవాళ్లు పురుషులను వేధిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలోనే యూజీసీ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, 2007లో తొలిసారిగా సెక్సువల్ వేధింపులపై ఇద్దరు పురుషులు ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఫిర్యాదు చేయగా, రామ్ జాస్ కళాశాలలో ఓ మహిళా అధ్యాపకురాలు తమను లైంగికంగా వేధిస్తోందంటూ ఇద్దరు విద్యార్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో యూజీసీ ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించినట్టుగా సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications