వైయస్కు ఫోన్ చేసి 'గాలి'కి షాకిచ్చారు!
ఒకే గదిలో ఉండటం విషయమే కాదని, ఏం చేశారో కూడా చెప్పాలని గాలి అతనికి సూచించారు. దానికి కాసు బదులిస్తూ... ఏం చేసినా వారిద్దరేనని, తాను ఎక్కువగా కలిసే వాడిని కాదన్నారు. ఆ తర్వాత కాసు జేబులోంచి సెల్ ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసి... ఆ రోజు మనతో పాటు హెలికాప్టర్లో ప్రయాణించిన గాలి ముద్దుకృష్ణమ మాట్లాడుతారట.. అని ఫోన్ను గాలికి ఇచ్చాడు. గాలి హలో హలో అన్నా అవతలి నుండి ఎవరు పలకలేదు.
ఎవరికి ఫోన్ చేశావని కాసును అడిగారు. అందుకు అతను వైయస్ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేశానని, మాట్లాడమని చమత్కరించారు. దాంతో గాలి ఓ నిమిషం షాక్కు గురయ్యారు. అనంతంర వైయస్ ఫోనేమిటయ్యా బాబు... నువ్వే మాట్లాడుకో అని ఫోన్ తిరిగి ఇచ్చారు. కాసు అంత సీరియస్గా సెల్ ఫోన్ తీసి నెంబర్ కొట్టి గాలి ముద్దుకృష్ణమకు ఇవ్వడం అక్కడ ఉన్న వారందరినీ కాసేపు నవ్వించింది.
ఈ సందర్భంగా.. వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక తాను, కాసు, వైయస్ ఉన్నప్పుడు జరిగిన ఒక సంభాషణను గాలి ముద్దృకృష్ణమ చెప్పారు. హెలికాప్టర్లో తాము ముగ్గురమే ఉన్నామని, 2004లో డబ్బు లేకుండానే అంతా గెలిచామని, ఇప్పుడు ఇంత అత్యాశ మంచిది కాదని తాను చెప్పానని అన్నారు. అప్పుడు వైయస్.. అవతలి వాళ్లకు టివిలు, పేపర్లు అన్నీ ఉంటే మనకు ఉండొద్దా, డబ్బులు కావద్దా అని సమర్థించుకున్నారని, దీనికి కాసు ప్రత్యక్ష సాక్షి అని చెప్పారు. నిజమేనంటూ కాసు తలూపారు.