హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపి బాధ్యత వహిస్తారా: నాగం

By Staff
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు కెవిపి రామచందర్ రావు బాధ్యత వహిస్తారా అని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదానికి ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్ఎస్పీ యాదవ్ పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. వాతావరణం సరిగా లేనప్పుడు ముఖ్యమంత్రి ఒత్తిడి చేసినా సంబంధిత అధికారులు ఎందుకు నివారించలేకపోయారని ఆయన అడిగారు. హెలికాప్టర్ నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు సమాచారం అందకపోతే పాలనా యంత్రాంగం ఏం చేసిందని ఆయన అడిగారు.

ఇదిలా పుంటే, ఏవియేషన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డిని సిబిఐ అధికారులు బుధవారం మూడు గంటల పాటు ప్రశ్నించారు. సిబిఐ అధికారులు ఏవియేషన్ కార్పోరేషన్ నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించి కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X