హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ దేవుడు నాకోసం పంపిన వ్యక్తి ఉపేంద్ర: చిరు

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: దివంగత నాయకుడు పర్వతనేని ఉపేంద్రపై చిరంజీవి తన ఆత్మీయతను చాటుకున్నారు. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి ఇటీవలే మరణించిన పీఆర్పీ సీనియర్‌ నేత ఉపేంద్ర సంతాపసభను ప్రజారాజ్యం పార్టీ నిర్వహించింది. ఫిల్మ్‌నగర్‌ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, పీసీసీ అధ్యక్షులు డీఎస్‌, వామపక్ష నేతలు రాఘవులు, నారాయణ, లోక్‌సత్తా జయప్రకాశ్‌నారాయణ్‌, బీజేపీనుంచి దత్తాత్రేయ, తెరాసనుంచి నాయని నర్సింహారెడ్డి హాజరయ్యారు.

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనకు చేదోడుగా ఉండమని భగవంతుడు పంపిన వ్యక్తి ఉపేంద్ర అని పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అదరూ తనని వీడి వెళ్లిపోతున్న సమయంలో ఉపేంద్ర ధైర్యం చెప్పకపోతే తానీ స్థితిలో ఉండేవాడిని కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X