పులిచింతల పనులు వేగవంతం
గతంలోలా పులిచింతల సాంకేతిక అనుమతుల కోసం హైదరాబాద్లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదని, ఇకపై ఒంగోలులోనే అనుమతులపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని వివరించారు. ఇందులో భాగంగా తాను పులిచింతలను పరిశీలించానన్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రోజుకు 800 మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఎండ వేడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లోనే కాంక్రీట్ పనులు నిర్వహిస్తున్నామన్నారు.
Story first published: Friday, May 14, 2010, 8:45 [IST]