హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి బుధవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సి - బ్లాక్ లో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. బాంబు బెదిరింపు వచ్చిన వెంటనే భద్రతా సిబ్బంది, బాంబు స్క్వాడ్ అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రోశయ్యను చంపుతామని బెదిరిస్తూ ఓ ఆగంతకుడు సిటీ సెక్యూరిటీ వింగ్ కు ఫోన్ చేసి చెప్పాడు.

ఫోన్ కాల్ ఉత్తదే నిర్ధారించుకున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫోన్ చేసి ఆగంతకుడు ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాదులోని ఓ కాయిన్ బాక్స్ నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ ఓ ఆకతాయి పనే అని భావిస్తున్నప్పటికీ పోలీసులు అధికారులు అతన్ని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X