సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు
ఫోన్ కాల్ ఉత్తదే నిర్ధారించుకున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫోన్ చేసి ఆగంతకుడు ఎవరు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాదులోని ఓ కాయిన్ బాక్స్ నుంచి ఆ ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ ఓ ఆకతాయి పనే అని భావిస్తున్నప్పటికీ పోలీసులు అధికారులు అతన్ని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Story first published: Wednesday, August 18, 2010, 14:14 [IST]