హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై మీడియా చిచ్చు: టీవీ9పై రాజ్ న్యూస్ మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

VK Duggal
హైదరాబాద్: తెలంగాణపై మీడియా వార్ మొదలయింది. గురువారం ఉదయం ఎన్టీవీ, టీవీ9 ఛానళ్లలో శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు వికె దుగ్గల్ ఇచ్చిన ఇంటర్వ్యూ మీడియా మధ్య యుద్ధానికి దారి తీసింది. దుగ్గల్ తన ఇంటర్వ్యూలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా కోరుతున్న వాదనల్ని పరిశీలిస్తామన్నట్లు టీవీ9 వార్తను ప్రసారం చేసింది. ఎన్టీవిలో కూడా దుగ్గల్ అదే విధంగా అన్నట్లు వార్త ప్రసారమైంది. దుగ్గల్ మాటలపై టీవీ9 చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ చర్చ సందర్భంగా టీవీ9పై తెలంగాణ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

అయితే దుగ్గల్ మాటలను సీమాంధ్ర మీడియా వక్రీకరిస్తోందని రాజ్ న్యూస్ వ్యాఖ్యానించింది. అన్ని ప్రాంతాలవారి వాదనలను పరిశీలించి అందరికీ సమన్యాయం చేస్తామని మాత్రమే దుగ్గల్ పేర్కొన్నారని రాజ్ న్యూస్ తెలిపింది. కాగా దుగ్గల్ వ్యాఖ్యల్ని సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ ఐకాన(జేఏసి) పేర్కొంది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని తెలంగాణ నాయకులు వాదిస్తున్నారు. హైదరాబాదు లేని తెలంగాణ తల లేని మొండెం లాంటిదని వారంటున్నారు. తెలంగాణ నుంచి హైదరాబాదును విడదీసి చూడలేమని అంటున్నారు. చారిత్రకంగా కూడా హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని వారు వాదిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X