హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వెంట 23 మంది ఎమ్మెల్యేలే, కాంగ్రెసువారు 19 మంది

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట ఎంత ప్రయత్నం చేసినా 23 మంది శాసనసభ్యులు మాత్రమే నడిచే పరిస్థితి ఉంది. ఈ సంఖ్య పెరిగే అవకాశాలు కూడా లేవని అంటున్నారు. తమ వెంట 70 మంది దాకా శాసనసభ్యులున్నారని వైయస్ జగన్ వర్గం నాయకులు చెబుతున్నారు. బయటకు కనిపించేది 30 మందే అయినా లోపల మద్దతు ఇచ్చేవారు 60 - 70 మంది దాకా ఉంటారని వారు చెబుతూ వస్తున్నారు. కానీ ఆ సంఖ్య ఎంత చెప్పినా 23 మందికి దాటే పరిస్థితి లేదని తెలుస్తోంది. వైయస్ జగన్ హైదరాబాదులో చేపట్టిన ఫీజు పోరు దీక్షకు ఎటు తిప్పినా ఆ 23 మంది మాత్రమే హాజరయ్యారు.

జగన్‌కు మద్దతు తెలుపుతున్న శాసనసభ్యుల్లో ఇద్దరేసి ప్రజారాజ్యం, తెలుగుదేశంవారు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన నల్లవురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి జగన్ వెంట నడుస్తున్నారు. ఇదేమీ ఆశ్చర్యకరం కాదు. అది ఊహించిన విషయమే. వైయస్ జగన్ వెంట కాంగ్రెసుకు చెందిన 19 మంది శాసనసభ్యులు నడుస్తున్నారు. వీరిలో సమయం వస్తే ఎంత మంది జగన్ వెంట ఉంటారనేది కూడా చెప్పలేం. వైయస్ జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ వంటి వారే పునరాలోచనలో పడ్డారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంత మంది జారిపోతారోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కమలమ్మ, బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొండా సురేఖ, కుంజా సత్యవతి, బాబూరావు, బాలరాజు, ప్రసాదరాజు వంటి వారు మొదటి నుంచీ జగన్ వెంట నడుస్తున్నారు. వీరు మాత్రమే జగన్ వెంట ఉండే అవకాశం ఉంది.

English summary
The strength of YS Jagan regarding MLAs may not increase further. About 23 MLAs are supporting YS Jagan. In these total MLAs 2 MLAs each from Telugudesam and Prajarajyam and 19 from Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X