హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే వేటు తప్పదు: డిఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ శుక్రవారం స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు దేనికీ రెఫరెండం కాదని చెప్పారు. కాంగ్రెసు పార్టీ చేసిన అభివృద్ధి పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు. రెండు నియోజకవర్గాలలోని పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి అందరూ విశ్వాసంగా ఉండాలన్నారు.

కాంగ్రెసు పార్టీ కొత్తవారికి గాలం వేస్తుందన్న వ్యాఖ్యలను డిఎస్ కొట్టి పారేశారు. కొత్తవారికి గాలాలు వేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. వైయస్ ప్రభావం పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నారు. ఉప ఎన్నికలలో ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా పని చేయవద్దని అన్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఎవరూ పూనుకోవద్దని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెసుకు ప్రజలు పట్టం గడతారని అన్నారు.

కాగా మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు శాసనసభ్యుడు కడప ఉప ఎన్నికలలో గెలుస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. త్రిముఖ పోరు రసవత్తరంగా ఉంటుందని ఆయన అన్నారు. కడపకు మంత్రి డిఎల్ సరైన అభ్యర్థి అన్నారు. కడప జిల్లాలో ప్రచారానికి వెళతానని చెప్పారు. వైయస్ చేసిన మంచి పనులను చెప్పుకునే హక్కు కేవలం కాంగ్రెసు పార్టీకే ఉందన్నారు. జగన్ కాంగ్రెసులో ఉంటే సంక్షేమ పథకాల గురించి చెప్పుకునే హక్కు ఉండేదన్నారు.

English summary
PCC president D Srinivas said today that party will take action if work against party. He said by-poles are not referendum. MLA JC Diwakar Reddy hoped that congress will win in by-pole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X