ఎమ్మల్యేలపై వైయస్ జగన్ ఒత్తిడి: ఆ ప్రకటన అందుకే

వైయస్ జగన్ ఒత్తిడి కారణంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి చిత్తశుద్ధికి ముడిపెడుతూ వారు ఓ ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో అవిశ్వాసాన్ని ప్రతిపాదించాలని, అప్పుడే తాము మద్దతిస్తామని సమావేశానంతరం పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదించినప్పుడు ఆలోచిద్దామని చాలా మంది శాసనసభ్యులు దాన్ని దాటవేసే ప్రయత్నాలు చేశారని అంటారు. కానీ జగన్ పట్టుబట్టడంతో సమావేశానంతరం మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ ప్రటన చేసినట్లు చెబుతున్నారు.
ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చిత్తశుద్ధితో అవిశ్వాసం పెడితే కచ్చితంగా తేడాలు వస్తాయని ఆయన అన్నారు. అవిశ్వాసంపై చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు మాట మార్చారని ఆయన విమర్శించారు. అవిశ్వాసం పెడితే ప్రభుత్వ మనుగడకు ప్రమాదం వస్తుందని, అయితే, అవిశ్వాసం సమయంలో తెలుగుదేశం సభ్యులంతా సభలో ఉండేలా చంద్రబాబు చూసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications