కాళ్లు మొక్కుతున్నా, బహిరంగంగా మాట్లాడొద్దు: గండ్ర
2010లో జరిగిన ఉప ఎన్నికలకు, ఈ ఉప ఎన్నికలకు తేడా స్పష్టంగా కనిపిస్తోందని, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో తన పార్టీకి చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయని, కానీ, ఇప్పుడు సెంటిమెంట్ ఉన్నా మెజారిటీ స్థానాల్లో గణనీయమైన ఓట్లు సాధించామని ఆయన చెప్పారు. కావాలంటే అధిష్టానంతో నేరుగా మాట్లాడవచ్చునని ఆయన సూచించారు.18 స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్న సమయంలో కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడొద్దని తమ పార్టీ నేతలను కోరారు. అభ్యర్థుల ఎంపికను సీఎం పూర్తి ఏకపక్షంగా చేశారనడం సరికాదన్నారు. అందరితో చర్చించాకే అభ్యర్థులను సీఎం నిర్ణయించారని గండ్ర చెప్పారు.
పద్ధతి ప్రకారం నైతిక బాధ్యత వహించాల్సి వస్తే వరంగల్ జిల్లాలో పార్టీ అభ్యర్థి ఓటమికి, జిల్లా అధ్యక్షుడిగా తాను, మంత్రులు బాధ్యత వహించాలన్నారు. కానీ, సీఎం, పీసీసీ చీఫ్ బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. ఒకవేళ 2014లో పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే అప్పుడు బాధ్యత వారిద్దరిపై ఉంటుందని చెప్పారు. కడప ఉప ఎన్నికల్లో ఓడినప్పుడు.. మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి రాజీనామా చేశారా?'' అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం అందరి రాజీనామాలు కోరడం సబబు కాదన్నారు.