భాను కిరణ్తో వైయస్ బంధువుల దందాపై సిఐడి ఆరా

భానుతో ఉన్న బంధం పైనా, ఇరువురు కలిసి చేసిన సెటిల్మెంట్ల పైనా సిఐడి మల్లికార్జున్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తమ కస్టడీలో భాను వెల్లడించిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో మల్లికార్జున రెడ్డి పేరుతో రిజిస్టర్ అయిన 15ఎకరాల భూమిని సిఐడి అధికారులు గుర్తించారు. దీనిపై సోమవారం ఉదయం నుంచి మల్లికార్జున రెడ్డిని రహస్యంగా విచారించారని తెలుస్తోంది.
దీంతో ఆయన అనుచరులు సిఐడి కార్యాలయ పరిసరాల్లో ఆందోళనగా కనిపించారు. సిటీస్క్వేర్ రియల్ ఎస్టేట్స్ యజమానులు దినేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి (జగన్ బావమరిది, మామ)తో కలిసి భాను వేసిన ఫ్రంట్లైన్ ప్రాజెక్టు గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈ వెంచర్ కోసం రైతుల నుంచి భూమలు సేకరించి వారికి ఇంకా డబ్బులు చెల్లించలేదని, అందులో కొంత భూమిని విక్రయించారని వచ్చిన ఫిర్యాదులపై సిఐడి దర్యాప్తు చేస్తోంది.
భాను భూదందాల వెనుక ఉన్న వారందరినీ బయటకు లాగే పనిలో పడింది. కడప జిల్లాలోని కమలాపురం, సింహాద్రిపురం, పులివెందుల ప్రాంతాలకు చెందిన మరికొందరిని సిఐడి అధికారులు పిలిపించే అవకాశాలున్నట్లు తెలిసింది. కాగా, సూరి హత్య సమయంలో కారు డ్రైవర్గా ఉన్న మధుమోహన్ రెడ్డిని సిఐడి అధికారులు సోమవారం విచారించారు. సుమారు గంటన్నరపాటు అతడిని ప్రశ్నించారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications