నిర్ణయం ఆశ్చర్యం కల్గించింది: కేంద్రంపై బొత్స అసంతృప్తి
రాష్ట్రానికి కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానాలలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. గ్యాస్ పైన మీడియాలో వస్తున్న వార్తలన్నీ వాస్తవావాలే అన్నారు. వర్షాలు లేకనే విద్యుదుత్పత్తికి ఆటంకం కలుగుతోందన్నారు. నిరాటంకంగా కరెంట్ ఉండాలని కోరుకోవటంలో తప్పు లేదని కానీ పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేవన్నారు.
తీవ్ర వర్షాభావం వల్లే అంచనాలకు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి కావడం లేదన్నారు. అందుకే విద్యుత్ సంక్షోభం తలెత్తుతోందన్నారు. దీనికి తోడు గ్యాస్ కోటాలో రాష్ట్రానికి మరింత ఇబ్బందికరమే అన్నారు. దబోల్ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ప్రభుత్వ ప్రాజెక్టు అన్నారు. 2008కి ముందే కళ్లు తెరిచి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అన్నారు.
కాగా రాష్ట్రానికి రావాల్సిన గ్యాస్ కోటాను మహారాష్ట్రకు తరలించడంపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. దీనిపై సొంత పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. కిరణ్ తమ గ్యాస్ తమకే కేటాయించమని అడిగేందుకు ఢిల్లీ వెళ్లారు.