నితీష్ గడ్డపై కాలుమోపిన మోడీ: బిజెపిలో ఉత్సాహం
పాట్నాకు వచ్చిన నరేంద్ర మోడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కలువలేదు. నరేంద్ర మోడీ రాక బీహార్ బిజెపిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వచ్చిందనే చెప్పవచ్చు. మోడీ 2010లో బిజెపి జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు జరిగినప్పుడు హాజరయ్యారు. మోడీకి, నితీష్ కుమార్కు మధ్య సత్సంబంధాలు లేవు. గతంలో బీహార్ ఎన్నికలు జరిగినప్పుడు నితీష్ కుమార్ మోడీ ప్రచారానికి రావద్దంటూ సూచించారు. ఇరువురి మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో మోడీ రాక ఆసక్తిని రేకెత్తించింది.
మరోవైపు బీహార్ను స్పెషల్ కేటగిరి రాష్ట్రంగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ జెడి(యు) పాట్నాలో ర్యాలీ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం బీహార్ను నిర్లక్ష్యం చేస్తోందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోపించారు. జెడి(యు) ర్యాలీ పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగింది. ఈ ర్యాలీలో జెడి(యు) ముఖ్యనేతలు నితీష్, శరద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో పొత్తు కలిగి ఉన్న బిజెపిని నితీష్ ఈ ర్యాలీలో నిస్మరించారు.