ఇక్కడొద్దు: విజయమ్మ దీక్షపై వీరశివ, స్పీకర్కు ఫిర్యాదు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ న్యూఎమ్మెల్యే క్వార్టర్సులో దీక్ష చేస్తుంటే భద్రత కరువైందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ నేతలకు పరామర్శల పేరుతో అసాంఘీక శక్తులు చొరబడుతాయని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. న్యూఎమ్మెల్యే క్వార్టర్సు వద్ద వారు దీక్ష చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ నాదెండ్ల మనోహర్కి, అసెంబ్లీ కార్యదర్శి సదారాంకి ఈ రోజు ఫిర్యాదు చేశారు. వారు వేరేచోట నెల రోజులు దీక్ష చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని చెప్పారు.
నిమ్స్లో బిజెపి దీక్ష కొనసాగింపు
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నిమ్స్లో దీక్ష చేస్తున్న భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మధ్యాహ్నం తమ దీక్షను విరమించారు. బిజెపి నేత రవి శంకర్ ప్రసాద్ కిషన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సూచనల మేరకు దీక్ష విరమించామని, ప్రజల్లోకి వెళ్లి పోరాడుతామని వారు చెప్పారు.
విజయవాడ మున్సిపల్ ఆఫీసు ముట్టడి
నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు విశాఖ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషనర్ చాంబరులోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుండి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.