వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రూ.152 కోట్లు జఫ్తు చేశాం: జగన్ ఆస్తులపై ఈడీ ఝలక్, హైకోర్టుకు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ భారతి సిమెంట్స్ సంస్థకు చెందిన రూ.152.85 కోట్లను జఫ్తు చేశామని, ఈ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఈడీ అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన ఆ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ భారతి సిమెంట్స్ సంస్థకు చెందిన రూ.152.85 కోట్లను జఫ్తు చేశామని, ఈ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఈడీ అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈడి హైకోర్టును ఆశ్రయించింది.
ఈ నిధులను ఈడికి చెందిన అకౌంట్లకు బదలాయించామని హైకోర్టుకు తెలిపింది. జగన్ అక్రమాస్తుల కేసులో ఈ నిధులను జప్తు చేశామని ఈడీ తెలిపింది.
తమ సొమ్మును ఈడీ అకౌంట్స్కు బదలాయించారని భారతి సిమెంట్స్ సంస్థ అప్పిలేట్ అథారిటీ ఆఫ్ ఈడీ వద్ద పిటిషన్ను గతంలో దాఖలు చేసింది.
ఫిబ్రవరి 7వ తేదీన ఈ కేసును విచారించిన ఈడీ అథారిటీ ఈ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఈడీని ఆదేశించింది. అనంతరం ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇడి గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
English summary
Enforcement Directorate on Thursday challenged in High Court over Bharathi Cements assets attach issue.
Story first published: Friday, April 21, 2017, 10:13 [IST]