హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వధువు లావు ఉందని మరో ఐదు లక్షలు అడిగాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Man demands more dowry for 'obese' bride
విజయవాడ: కృష్ణా జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. వధువు లావు ఉందనే కారణంతో అదనంగా మరో ఐదు లక్షల కట్నం ఇవ్వాలని వరుడు ఆమె తల్లిదండ్రులను డిమాండ్ చేసిన సంఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. ఈ సంఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సరిగా స్పందించకపోవడంతో వధువు తరఫు వాళ్లు మాచవరం పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.

హైదరాబాదుకు చెందిన పి. విక్రమనాయుడు మాచవరానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు. నిశ్చితార్థం కూడా జరిగింది. కట్నంగా పది లక్షల రూపాయలు ఇవ్వడానికి వధువు తల్లిదండ్రులు అంగీకరించి ముందుగా కొంత చెల్లించారు కూడా.

కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా విక్రమనాయుడు వధువుకు ఫోన్ చేసి - మరో ఐదు లక్షల కట్నం ఇవ్వాలని, ఆ సొమ్ము చెల్లించకపోతే 20 కిలోల బరువు తగ్గాలని షరతు పెట్టాడు. ఫిబ్రవరి 6వ తేదీన విక్రమనాయుడు ఆ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

మే 12వ తేదీన పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు సిపిఐ నాయకుల సహాయం తీసుకున్నారు. సిపిఐ కార్యదర్శి దోనెపూడి శంకర్ పోలీసులను సంప్రదించారు. సిపిఐ కార్యకర్తలు పోలీసుల వైఖరిని నిరసిస్తూ ధర్నాకు దిగారు.

English summary
A man demanded additional dowry of Rs.5 lakh from the parents of a bride claiming the girl was obese, in an incident that led to protests outside the Machavaram police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X