దీపాలు వెలిగించేప్పుడు, టపాకులు కాల్చేప్పుడు జాగ్రత్త.. శానిటైజర్కు దూరంగా ఉండండి: వైద్యులు
నేడు దీపావళి.. పండగ అంటే స్వీట్లు తిని, టపాకులు కాల్చి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ సారి కరోనా వైరస్ రావడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శానిటైజర్ వాడి టపాకులు కాల్చడం వల్ల మంటలు లేసే ప్రమాదం ఉంది. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కోటికాంతులు నింపాలని, ఆనంద దీపాలు వెలగాలని.. ప్రధాని మోడీ, జగన్, కేటీఆర్ విషెస్..
కరోనా వైరస్ వల్ల తరచూ చేతులను శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. బయటకు వెళ్లి వస్తే విధిగా శానిటైజర్ రాసుకోవాల్సిందే. అయితే శానిటైజర్లలో 60 శాతం ఆల్కహాల్తో ఉంటాయి. ఇవీ మండే స్వభావం ఉంటున్నందన.. త్వరగా మంటలు వస్తాయి. అందుకోసం టపాకులు కాల్చే సమయంలో.. దాదాపు గంట ముందు శానిటైజర్ ముట్టుకోవద్దని వైద్యులు సజెస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో శానిటైజర్ వాడి.. బాణాసంచా కూడా పేల్చొద్దని పేర్కొన్నారు.
పండగ సందర్భంగా బంధుమిత్రులన కలుస్తారు. అయితే కలిసిన సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వకుంటే బెటర్. ఒకవేళ చేతులు కలిపితే.. మళ్లీ శానిటైజర్ రాసుకోవాల్సి వస్తోంది. దానికి బదులు నమస్కారం పెట్టి.. దూరం దూరం ఉండాలని కోరుతున్నారు. అలాగే చేతులు పొడిగా అయ్యేందుకు సమయం కూడా పట్టకపోవచ్చు. దీంతోపాటు దీపాలను వెలగించే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అరగంట ముందు శానిటైజర్ రాసుకోవద్దు.. రాసుకున్న సబ్బు/ హ్యాండ్ వాష్తో శుభ్రంగా కడుక్కొవాలని సూచిస్తున్నారు.
Recommended Video
శానిటైజర్ సీసాలను జేబులో పెట్టుకోవడం ప్రమాదం అని చెబుతున్నారు. దీపాలు వెలిగించే సమయంలో కూడా సీసా దగ్గర ఉంచుకొవద్దని వెల్లడించారు. టపాసులు కాల్చే సమయంలో కూడా జేబులో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మరీ మరీ సూచిస్తున్నారు.