టెక్కీలకు శుభవార్త: చెన్నై ఇన్పోసిస్ సెంటర్ కు 20 ఏళ్ళు, 20 వేలకు చేరిన ఉద్యోగులు
ఇన్పోసిస్ చెన్నై అభివృద్ది కేంద్రం ప్రారంభించి నేటికి 20 ఏళ్ళు పూర్తైంది. చెన్నైలో 300 మందితో ఈ సంస్థ ప్రారంభమైంది.అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థ గణనీయమైన అభివృద్దిని సాధించింది.
చెన్నై: ఇన్పోసిస్ చెన్నై అభివృద్ది కేంద్రం ప్రారంభించి నేటికి 20 ఏళ్ళు పూర్తైంది. చెన్నైలో 300 మందితో ఈ సంస్థ ప్రారంభమైంది.అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థ గణనీయమైన అభివృద్దిని సాధించింది.
భారత ఐటీ పరిశ్రమలో ఇన్పోసిస్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.అయితే ఈ సంస్థ అంచెలంచెలుగా అభివృద్ది సాధిస్తోంది. ఇందుకు చైన్నెలోని అభివృద్ది కేంద్రాన్ని ఉదహరణగా చెబుతున్నారు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు.
మూడు వందల మందితో 1996 లో చెన్నైలో అభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించింది ఇన్పోసిస్ .అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 20 వేలకు పెరిగింది. మంగళవారం నాడు ఈ సంస్థ వార్షికోత్సవాన్ని నిర్వహించింది.
సుదీర్ఘకాలంపాటు ఇక్కడే పనిచేసిన ఉద్యోగులను సన్మానించారు. మహీంద్రా వరల్డ్ సిటీ, సింగపెరుమాళ్ కోయిల్, షోలింగనల్లూరుకు వరకు విస్తరించిందని సంస్థ ప్రకటించింది.
English summary
The Chennai development centre of IT major infosys has witnessed its employee strength grow manifold at its centres setup in the last two decades from 300 in 1996 to over 20,000 at present.
Story first published: Tuesday, March 14, 2017, 22:14 [IST]