టెక్కీలకు శుభవార్త: చెన్నై ఇన్పోసిస్ సెంటర్ కు 20 ఏళ్ళు, 20 వేలకు చేరిన ఉద్యోగులు
ఇన్పోసిస్ చెన్నై అభివృద్ది కేంద్రం ప్రారంభించి నేటికి 20 ఏళ్ళు పూర్తైంది. చెన్నైలో 300 మందితో ఈ సంస్థ ప్రారంభమైంది.అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థ గణనీయమైన అభివృద్దిని సాధించింది.
చెన్నై: ఇన్పోసిస్ చెన్నై అభివృద్ది కేంద్రం ప్రారంభించి నేటికి 20 ఏళ్ళు పూర్తైంది. చెన్నైలో 300 మందితో ఈ సంస్థ ప్రారంభమైంది.అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థ గణనీయమైన అభివృద్దిని సాధించింది.
భారత ఐటీ పరిశ్రమలో ఇన్పోసిస్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.అయితే ఈ సంస్థ అంచెలంచెలుగా అభివృద్ది సాధిస్తోంది. ఇందుకు చైన్నెలోని అభివృద్ది కేంద్రాన్ని ఉదహరణగా చెబుతున్నారు ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు.

మూడు వందల మందితో 1996 లో చెన్నైలో అభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించింది ఇన్పోసిస్ .అయితే 20 ఏళ్ళలో ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 20 వేలకు పెరిగింది. మంగళవారం నాడు ఈ సంస్థ వార్షికోత్సవాన్ని నిర్వహించింది.
సుదీర్ఘకాలంపాటు ఇక్కడే పనిచేసిన ఉద్యోగులను సన్మానించారు. మహీంద్రా వరల్డ్ సిటీ, సింగపెరుమాళ్ కోయిల్, షోలింగనల్లూరుకు వరకు విస్తరించిందని సంస్థ ప్రకటించింది.












Click it and Unblock the Notifications