సీఎం పళనిసామిపై తిరుబాటు ఎమ్మెల్యేలు: వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు
అన్నాడీఎంకే 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు హైకోర్టు హెచ్చరికతమాషాలు చేస్తున్నారా ? ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వస్తారారెండు రోజులు కాలేదు, తీర్పు వచ్చే వరకూ వేచిచూడలేరా ? జాగ్రత్త
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు 18 మందికి తమిళనాడు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ శుక్రవారం అక్షింతలు వేసింది. చట్టం మీద గౌరం లేకుండా ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వచ్చి న్యాయస్థానం సమయాన్ని వృదా చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించింది.
తమిళనాడు స్పీకర్ ధనపాల్ తమ మీద ఏకపక్షంగా వ్యవహరించి చట్ట వ్యతిరేకంగా అనర్హత వేటు వేశారని, వెంటనే స్పీకర్ ఆదేశాలను రద్దు చెయ్యాలని 18 మంది అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు శుక్రవారం మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ పరీశీలించిన మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు బెంచ్ లో కేసు విచారణలో ఉందని, పై కోర్టులో విచారణలో ఉన్న కేసును మళ్లీ కింది కోర్టుకు తీసుకు వస్తారా అని మధురై బెంచ్ మండిపడింది.
ప్రతిచిన్న విషయానికి కోర్టుకు వచ్చి న్యాయస్థానం సమయాన్ని వృదా చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించింది. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ మందలించడంతో టీటీవీ దినకరన్ వర్గీయులు హడలిపోయారు. బుధవారం మద్రాస్ హైకోర్టు 18 మంది అనర్మత ఎమ్మెల్యేల కేసు విచారణ చేసి అక్టోబర్ 4వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications