మరో జెఎన్యు విద్యార్థి అదృశ్యం: క్యాంపస్ వీడుతూ..
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు)కు చెందిన విద్యార్థి కనిపించుకుండా పోయాడు. అదృశ్యమైన విద్యార్థుల్లో ఇతను రెండవ వాడు. ఇంతకు ముందు నజీబ్ అహ్మద్ అనే విద్యార్థి కనిపించుకుండా పోయాడు.
తాజాగా అదృశ్యమైన స్కాలర్ను ముకుల్ జైన్గా గుర్తించారు. ఘజియాబాద్కు చెందిన అతను సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అతను ప్రతి రోజూ ఘజియాబాద్ నుంచి విశ్వవిద్యాలయానికి వస్తుంటాడు.
#jnu Mukul Jain @mukulja63941274 has been missing from his Life Science lab since yesterday afternoon. Nobody knows where he is. His wallet and id are still in lab. JNU students we need your help in searching for him. Inbox me any info regarding him. We will be greatly indebted. pic.twitter.com/1QivRX4ROh
— Mayank Jain (@mayankjain2011) January 9, 2018
సోమవారం సాయంత్రం క్యాంపస్ నుంచి వెళ్లిపోయినట్లు సిసీటివిలో రికార్డయింది. అంతకు ముందు ఘజియాబాద్లోని ఇంటికి వెళ్లాడు. లాబొరేటరీకి వెళ్తూ అతను చివరిసారి కనిపించాడు.
వ్యాలేను, ఫోన్ను అతను గదిలోనే ఉంచేసి వెళ్లిపోయినట్లు సహ విద్యార్థులు పోలీసులకు చెప్పారు. ముకుల్ జైన్ జెఎన్యులోని లైఫ్ సైన్సెస్ విభాగంలో పరిశోధక విద్యార్థి.
ఇంతకు ముందు నజీబ్ జెఎన్యులోని మహి - మండవి హాస్టల్ నుంచి కనిపించకుండా పోయాడుు. ఆ సంఘటన 2016 అక్టోబర్ 15వ తేదీన చోటు చేసుకుంది. మరో వర్గానికి చెందిన విద్యార్థులతో ఘర్షణ పడిన తర్వాత అతను కనిపించకుండా పోయాడు.