వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఎన్నికలు: ఆజ్‌తక్ సర్వేలో కాంగ్రెస్‌కు 118 , బిజెపికి 92 సీట్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో శనివారం నాడు జరిగిన ఎన్నికల్లో ఆజ్‌‌తక్ సర్వే లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకొంటుందని తేల్చి చెప్పింది. ఈ సర్వే ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకొంటుందని ఈ సర్వే తేల్చింది.

ఈ సర్వే ప్రకారంగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 106 నుండి 118 సీట్లు, బిజెపికి 79 నుండి 92 సీట్లు దక్కే అవకాశం ఉంది. జెడి(ఎస్‌)కు 22 నుండి 30 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు అతి చేరువలోకి దగ్గరకు చేరుకొందని చెప్పారు.

కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కాలంలో వరుసగా రెండో దపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అయితే ఈ ఎగ్జిట్ ఫలితాలు నిజమైతే అతి పెద్ద పార్టీగా అవతరించిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కనుంది. అయితే జెడి (ఎస్) ఏ పార్టీకి మద్దతిస్తోందోననే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

Karnataka Elections 2018 Exit Poll Results – AAP, BJP, Congress and Others

పోలింగ్ రోజున ఓటు వేసిన తర్వాత బిజెపితో పొత్తు పెట్టుకోబోమని మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవేగౌడ్ ప్రకటించారు. అయితే మే 15 తర్వాత ఏ రకమైన రాజకీయ సమీకరణాలు మారుతాయో చూడాల్సిన అవసరం ఉంది.

మొత్తానికి కర్ణాటక ఎన్నికల్లో జెడి(ఎస్) కింగ్ మేకర్ గా మారే అవకాశం లేకపోలేదు. అయితే జెడి(ఎస్) ఏ పార్టీతో పొత్తుకు సై అంటుందనే విషయమై రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

English summary
The Fifteenth Legislative Assembly of Karnataka is going to held in 2018. The people of Karnataka, will once again have the power to their representatives and Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X