గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ఇలా...: ప్రధాని మోడీ 'ఐడియా'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా జనవరి 26న గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ఒబామాను పిలవాలన్న ఐడియా ప్రధాని మోడీకి వచ్చింది. ఈ ఆలోచన వచ్చిన వెంటనే మోడీ.. అమెరికాలోని ఇండియన్ అంబాసిడర్కు విషయాన్ని చెప్పారని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించాలన్న ఆలోచన ప్రధాని మోడీకి వచ్చిందని చెప్పారని అంటున్నారు. ఈ విషయం చెప్పి శ్వేత సౌధం సమాధానం ఏమిటో చెప్పాలని సూచించారు. అనంతరం అమెరికాలోని భారత రాయబారి పలుమార్లు అధికారులతో భేటీ అయ్యారు.
వారు గణతంత్ర వేడుకల ప్రాధాన్యతను వివరించారట. దీంతో, అమెరికా ప్రతినిధులు మోడీ పొలిటికల్ గెశ్చర్ను ప్రశంసించారట. కొద్ది టైంలోనే వారు ఆమోదాన్ని తెలిపారు. అనంతరం భారత రాయబారికి ఒకే చెప్పారు. అనంతరం ప్రధాని మోడీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పారు.
బరాక్ ఒబామాను గణతంత్ర వేడుకలకు అతిథిగా తీసుకు వస్తున్నట్లు అతను ట్వీట్ చేశారు. ఈ తతంగమంతా ఇరువైపుల కూడా చాలా క్లోజ్ అఫీషియల్స్ ద్వారా జరిగిందంటున్నారు. దీని గురించి చాలా కొద్ది మందికే తెలుసంట. నరేంద్ర మోడీ, ఒబామాలు సెప్టెంబర్ 30వ తేదీన భేటీ అయిన తర్వాత కొద్ది రోజులకే ఈ తతంగం జరిగిందని తెలుస్తోంది.