హద్దులు దాటారు..: చాటింగ్ నుంచి బెడ్ రూమ్ దాకా!, ఆ తర్వాతే అనుకోని షాక్
బెంగళూరు: వాళ్లిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం. ఇద్దరూ వివాహితులే. అయినా హద్దులు దాటారు. ఆ తర్వాతే అతనికి ఆమె మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చింది.
అతనితో సన్నిహితంగా గడిపిన ఫోటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేసింది. లక్షల్లో డబ్బు గుంజింది. అయినా సరిపోలేదు. పదేపదే డబ్బుల కోసం డిమాండ్ చేస్తుండటంతో.. చివరకు అతను పోలీసులను ఆశ్రయించాడు.
అసలేంటీ వ్యవహారం:
బెంగళూరుకు చెందిన గౌరీశంకర్ (30)కి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా సరే ఫేస్బుక్ లో కాలక్షేపం చేయకుండా ఉండలేడు. ఇదే క్రమంలో ఆర్నెళ్ల క్రితం ఓ మహిళ అతనికి ఫేస్బుక్ లో పరిచయమైంది. ఆమెకు కూడా పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చాటింగ్స్ నుంచి బయట కలుసుకునేదాకా..:
ఈ ఇద్దరి ఫేస్బుక్ పరిచయం త్వరలోనే మరింత సానిహత్యానికి దారితీసింది. మొదట్లో చాటింగ్స్కే పరిమితమైన ఇద్దరు.. ఆ తర్వాత గంటల తరబడి కాల్స్ మాట్లాడుకునేవారు. అలా ఓసారి బయట కలవాలని నిర్ణయించుకున్నారు. వీలు చూసుకుని రెండు నెలల క్రితం ఒక రెస్టారెంట్లో కలుసుకున్నారు.
హద్దులు దాటేశారు..:
మొదటిసారి కలిసినప్పుడు.. ఇద్దరూ ఒకరినొకరు పొగుడుకోవడానికే సరిపోయింది. 'మీరు చూసేందుకు ఇద్దరు పిల్లల తల్లిలా కనిపించడం లేదు' అని గౌరీ శంకర్ అంటే.. మీరు కూడా చాలా యంగ్గా కనిపిస్తున్నారని ఆమె పొగిడింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆమె అతన్ని ఇంటికి రమ్మని పిలిచింది. అక్కడ ఇద్దరూ హద్దులు దాటేశారు. ఆపై అంతా సాఫీగానే ఉందనుకున్న తరుణంలో అతనికో పెద్ద షాక్.
ఆ ఫోటోలు చూసి షాక్:
ఒకరోజు గౌరీ శంకర్ సెల్ ఫోన్ కు ఆమెతో సన్నిహితంగా గడిపిన ఫోటోలు, వీడియోలు వచ్చాయి. అవి చూసి అతను షాక్ తిన్నాడు. ఏంటని ఆరా తీస్తే.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని మీ ఇంట్లో వాళ్లకు పంపిస్తానని ఆమె బెదిరింపు.
చేసేదేమి లేక రూ.5.48లక్షలు ఆమెకు ఇచ్చాడు. ఆపై పదేపదే డబ్బు కోసం ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. ఆమె గతంలో చాలామందిని ఇలాగే మోసం చేసిందని తెలిసింది. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్టు సమాచారం.