షాక్: తల్లి అస్థిపంజరంతో ఆరు నెలలుగా గడుపుతోంది!
తల్లి అస్థిపంరంతో ఆరు నెలలుగా గడుపుతున్న ఓ మహిళ మృతదేహాన్ని షాగంజ్ పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్లోని అర్జున్నగర్లో బీనా అనే మహి(45)ళ తన తల్లి శవంతో ఉంటోంది.
ఆగ్రా: తల్లి అస్థిపంరంతో ఆరు నెలలుగా గడుపుతున్న ఓ మహిళ మృతదేహాన్ని షాగంజ్ పోలీసులు గుర్తించారు. ఉత్తర ప్రదేశ్లోని అర్జున్నగర్లో బీనా అనే మహి(45)ళ తన తల్లి శవంతో ఉంటోంది. రెండు రోజులుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంట్లోని తల్లి అస్థిపంజరంతో ఉన్న బీనా మృతదేహాన్ని గుర్తించారు. ఆ అస్థిపంజరంతోపాటు బీనా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, బీనా (45) ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు కాగా, ఆమె తల్లి ప్రభుత్వ రిటైర్డు నర్సు.
అయితే బీనా ఉద్యోగం మానేయడంతో తల్లికి వచ్చే పింఛనుతోనే కుటుంబం నడిచేదని స్థానికులు తెలిపారు. అయితే బీనా మానసిక పరిస్థితి ప్రస్తుతం బాగాలేదని స్థానికులు అంటున్నారు. బీనా మరణంపై అనుమానాలు ఉండటంతో పోస్ట్మార్టం అయ్యేంత వరకు వేచి చేడాలని ఫోరెన్సిక్ నిపుణుడు అజయ్ అగర్వాల్ తెలిపారు.