వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచాయితీ పెద్దల తీర్పుతో మహిళ ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

భోపాల్: అక్రమ సంబంధం అంటగట్టారని మనోవేదనకు గురైన వివాహిత ఆత్మహత్య చేసుకునింది. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లోని టికామ్ గడ్ జిల్లాలో జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

టికామ్ గడ్ జిల్లాలోని బజూరువా ఖారీ గ్రామంలో (36) ఏళ్ల వివాహిత భర్త రాకేష్, నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. మూడు రోజుల కిందట రాకేష్ స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు. ఆ సందర్బంలో రాకేష్ స్నేహితుడైన దళితుడితో అతని భార్య సన్నిహితంగా ఉందని కుల పెద్దలు ఆరోపించారు.

Woman kills self after panchayat declares Characterless

ఇదే విషయంపై పంచాయితీ జరిగింది. పంచాయితీ పెద్దలు ఈ విషయం సీరియస్ గా తీసుకున్నారు. వివాహిత దళితుడితో సన్నిహితంగా ఉందని, ఆ దళితుడు రాకేష్ తో కలిసి పని చేస్తున్నాడని కొందరు సాక్షం చెప్పాడంతో పంచాయితీ పెద్దలు ఈ విధంగా తీర్మానించారు. వివాహితకు రూ. ఐదు వేలు జరిమానా కట్టాలని తీర్పు చెప్పారు.

దళితుడితో సంబంధం పెట్టుకున్నారని ఆ మహిళను మందలించారు. ఆమెను గంగా నదిలో స్నానం చెయ్యాలని, 30 మందికి మందు పార్టీ ఇవ్వాలని, గ్రామంలో ఉండే శివాలయం వరకు పోర్లుదండాలు పెడితే ఆమె చేసిన తప్పును క్షమిస్తామని పంచాయితీ పెద్దలు తీర్పు చెప్పారు. ఈ విషయంపై విరక్తి చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుందని పోలీసు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, పంచాయితీ పెద్దలను విచారిస్తున్నామని పోలీసు అధికారులు వివరించారు.

English summary
The members of the village panchayat had ordered the woman and her family to take a bath in the Ganga river and arrange a liquor party for around 30 residents of the village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X