జికా: కేరళలో 15 కేసులు, దోమలతోనే కాదు సెక్స్ వల్ల కూడా వ్యాపించే ప్రమాదకర వైరస్
కేరళలో 15 జికా వైరస్ కేసులు గుర్తించడంతో అన్ని జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
తిరువనంతపురం జిల్లాలో జికా వైరస్ కేసులను గుర్తించినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ధ్రువీకరించారు.
ఇంతకుముందు 2016-17లో గుజరాత్లో జికా వైరస్ కేసులు గుర్తించారు.
దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల పిల్లల్లో మెదడు పరిమాణం తగ్గిపోవడంతో పాటు గిలన్ బరె సిండ్రోమ్ అనే ఆటో ఇమ్యూన్(రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని కణాలపైనే దాడి చేయడం) వ్యాధి వచ్చే అవకాశమూ ఉంటుంది.
సాధారణంగా దోమల ద్వారా వ్యాపించే ఈ వైరస్ సెక్స్ వల్ల కూడా వ్యాపిస్తుంది.
- జికా వైరస్: క్యాన్సర్కు మందు
- జికా వైరస్: ఎక్కడ పుట్టింది? ఎలా వ్యాపిస్తుంది? దాని నుంచి తప్పించుకోవడం ఎలా?
తిరువనంతపురంలో కొత్తగా గుర్తించిన జికా వైరస్ కేసులన్నీ హెల్త్ కేర్ రంగంలో పనిచేస్తున్నవారిలోనే గుర్తించారు.
తమిళనాడు సరిహద్దుల్లోని ఒక పట్టణానికి చెందిన 24 ఏళ్ల గర్భిణికి మొట్టమొదట ఈ వైరస్ సోకిందని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
జ్వరం, తలనొప్పి, ఒళ్లంతా దద్దుర్లతో బాధపడుతున్న ఆమెను జూన్ 28న ఆమెను తిరువనంతపురంలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. జులై 7న ఆమె ప్రసవించింది.
''ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉంది. సాధారణ ప్రసవమైంది. వైరస్ సోకడానికి ముందు ఆమె కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన దాఖలాలు లేవు'' అని మంత్రి చెప్పారు.
''రుతు పవనాల కారణంగా కురుస్తున్న వర్షాలతో దోమలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అవి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి'' అన్నారామె.
వైరస్ ప్రబలిన ప్రాంతాలకు ప్రభుత్వం అధికారుల బృందాలను పంపించిందని కేరళ హెల్త్ సెక్రటరీ రాజన్ ఖోబ్రగడే 'బీబీసీ'తో చెప్పారు.
ఆ బృందాలు ప్రజలకు జికా వైరస్ పట్ల అవగాహన కల్పిస్తాయని.. గర్భిణులు, జంటలు ఈ వ్యాధికి గురికాకుండా జాగ్రత్తలు చెబుతాయని తెలిపారు.
భారత్లో తొలి కరోనా కేసు కూడా కేరళలోనే 2020 జనవరిలో గుర్తించారు.
కేరళలో కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల రేటు 10 శాతం కంటే ఎక్కువగానే ఉంటోంది.
మొట్టమొదట ఎక్కడ గుర్తించారు?
జికా వైరస్ను మొట్టమొదట 1947లో యుగాండాలోని జికా అటవీ ప్రాంతంలోని కోతులలో గుర్తించారు. ఇది అంతకుముందు లేని కొత్త వైరస్ అని 1952లో తేల్చారు.
మనుషులలో మొదట ఎప్పుడంటే?
* మనుషులకు కూడా ఈ వైరస్ సోకినట్లుగా 1954లో నైజీరియాలో గుర్తించారు.
* ఆ తరువాత ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలు, పసిఫిక్ ద్వీప దేశాల్లోనూ జికా వైరస్ కేసులు బయటపడ్డాయి.
* 2015 మే నెలలో బ్రెజిల్ ఇది తీవ్రంగా వ్యాపించింది.
భారత్లో మొదటి కేసు ఎప్పుడు? ఏ రాష్ట్రంలో?
2016-17లో గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో జికా వైరస్ కేసులు నమోదయ్యాయి.
జికా వైరస్ భారతీయులకూ సోకే ప్రమాదం ఉందని 1953లోనే ఒక పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
ఎలా వ్యాపిస్తుంది?
* జికా వైరస్ దోమల ద్వారానే కాకుండా సెక్స్ వల్ల కూడా వ్యాపిస్తుంది.
లక్షణాలు ఏమిటి?
* జ్వరం, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, కళ్లు ఎర్రబారడం దీని లక్షణాలు
* జికా వైరస్ సోకిన ప్రతి అయిదుగురిలో ఒకరికి మాత్రమ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ వల్ల కొందరు ప్రాణాలు కూడా కోల్పోతారు.
చికిత్స ఉందా?
* ఈ వ్యాధికి ఇంతవరకు చికిత్స లేదు. దోమలు కుట్టకుండా జాగ్రత్త పడడమే దీనికి పరిష్కారం.
దోమల నివారణకు చర్యలు తీసుకోవడం వల్ల వ్యాధి బారిన పడకుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- తంత్ర యోగా పేరుతో అత్యాచారాలు, శివానంద సెంటర్ గుట్టు బయటపెట్టిన బీబీసీ
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్లో పరిస్థితి ఏంటి?
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)