video:ఆవులను కాపాడిన మత్స్యకారులు భేష్, లోకేశ్ అభినందనలు
నల్లమల అడవులను అనుకుని ఎన్టీఆర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. ఆ పరిసరాల్లోకి మేత కోసం ఆవులు, గేదెల మంద వెళ్లాయి. అయితే అడవి పందులను చూసి అవి బెదిరిపోయాయి. నీటిలోకి దాదాపు 350 వరకు దుకాయి. ఆ ఆవులను అక్కడే ఉన్న మత్స్యకారులు రక్షించారు. వాటిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది.
నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉండటంతో దాని పరిసరాల్లో ఆవులు, గేదెలను మేత కోసం వాటి యజమానులు తీసుకెళుతుంటారు.
అడవిలో నుంచి పందుల సమూహం వేగంగా పరుగులు తీసి వచ్చింది. దీంతో గోవుల మందలోని కొన్ని ఆవులు రిజర్వాయర్లోని నీటిలోకి దూకేశాయి. షాక్కు గురైన కాపరులు సమీపంలో ఉన్న మత్స్యకారులను అప్రమత్తం చేయగా... వారు చిన్న బోట్లతో నీటిలోకి వెళ్లి ఆవులను ఒడ్డుకు చేర్చారు.

నీటిలోకి దూకిన ఆవులను మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మూగ జీవాలు ఆవుల మందను చాకచక్యంగా మత్స్యకారులు ఒడ్డుకు తరలించారని లోకేశ్ పేర్కొన్నారు. మత్స్యకారులను ఆయన ప్రశంసించారు. ఆవులను కాపాడిన మత్స్యకారులు, ఆవులపై ఆధారపడిన పాడి రైతు కుటుంబాలను కూడా కాపాడినట్టేనని పేర్కొన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications